తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త. ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో 260(61 ఎగ్జిక్యూటివ్, 199 నాన్ ఎగ్జిక్యూటివ్) ఉద్యోగాలకు తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది.
ఇందులో భాగంగా అంతర్గత నియామకాలతో వీటిని భర్తీ చేస్తారు. అర్హులైన ఉద్యోగులు ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నేటి నుంచి ఈ నెల 13వ తేదీలోగా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు జీఎం పర్సనల్, సింగరేణి హెడ్ ఆఫీస్, కొత్తగూడెం అడ్రసు ఈ నెల 25లోగా నేరుగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.