Politics ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పై విమర్శలు గుప్పించారు ఊరికే గొప్పలు చెప్పుకోవడం సరికాదని ఏ విషయాన్ని అయినా చేసి చూపించాలని అన్నారు.. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనాన్ని సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టినట్టు గొప్పలు చెప్పుకుపోయారంటూ వ్యాఖ్యానించారు.
త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో విజయనగరం సుజాత కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో జరిగిన వైసిపి నాయకుల సమావేశంలో మాట్లాడారు బొత్స సత్యనారాయణ ఈ సందర్భంగా గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టుబడులకు సంబంధించి ఎన్నో సమ్మెట్లు నిర్వహించారని అన్నారు అయితే గతంలో ఇంకేం ముఖ్యమంత్రి ఈ విధంగా సమ్మెకు నిర్వహించలేనట్టు గొప్పలు చెప్పుకుంటూ పోయారని చెప్పుకొచ్చారు..
అయితే ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం విశాఖపట్నంలో ఎంతో క్రమశిక్షణ గ్లోబల్ ఇన్వెంటర్స్ సమ్మేట్ నిర్వహించారని అన్నారు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వ్యాపారవేత్తలు ఈ సమ్మెకు వచ్చారని తెలిపారు తన అధ్యక్షతన కమిటీ వేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పుకొచ్చారు. అలాగే కేవలం ఎంవోయూలే ముఖ్యం కాదని, గ్రౌండింగ్ కూడా ముఖ్యమన్నది సీఎం జగన్ ఆలోచన అని చెప్పారు. అలాగే ఈ నెల 13వ తేదీన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయని.. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో 2.70 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, ఒక్క పట్టణంలోనే 17 వేల మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారని తెలిపారు. ఒక్కొక్క బూత్కు 800 మంది ఓటర్లు ఉంటారన్నారు. రాజకీయ పార్టీలకు ఏ ఎన్నికలైనా ప్రతిష్టాత్మకమైనవేనని అన్నారు.