Home / SLIDER / రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కవితకి ఈడీ నోటీసులు

రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కవితకి ఈడీ నోటీసులు

 ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కవితపై   ఆరోపణలు చేస్తున్నారని మంత్రి జగదీశ్‌ రెడ్డి  ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధానమంత్రి నరేందర్  మోదీ   దురాగతాలను బయట పెడుతున్న ముంఖ్యమంత్రి కేసీఆర్‌పై  కుట్రలో భాగమే ఎమ్మెల్సీ కవితకు నోటీసులని విమర్శించారు.

అణచివేత దోరణితోనే దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని ప్రతిపక్షాలను భయపెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీ దుర్మార్గాలకు రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు.

సూర్యాపేటలో తన నివాసంలో మంత్రి జగదీశ్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కవితకు ఈడీ నోటీసులు మోదీ ప్రభుత్వ దుర్మార్గాలకు పరాకాష్ట అన్నారు. ప్రజల కోసం పని చేసే నేతలకు కేసులు, జైళ్లు కొత్త కాదన్నారు. నియంతలు నిలబడిన చరిత్ర ఏనాడూ లేదన్నారు. బీజేపీ అసలు రూపాన్ని ప్రజా క్షేత్రంలో బట్టబయలు చేస్తామని వెల్లడించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat