ప్రపంచ శాంతి కోసం బ్రహ్మకుమారిలు చేస్తున్న కృషి అభినందనీయమని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పేర్కొన్నారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని కైలాష్ హిల్స్ లో నూతనంగా నిర్మించిన బ్రహ్మకుమారిస్ శివ జ్యోతి భవన్ ‘రాజ్ యోగ మెడిటేషన్ సెంటర్‘ను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రపంచ శాంతి కోసం పవిత్ర సందేశమిస్తూ, అనేక సేవలందిస్తున్న బ్రహ్మకుమారిస్ ఉన్న ప్రతీ ప్రాంతం ప్రశాంతంగా ఉంటుందని కొనియాడారు. గాజులరామారం ప్రాంతంలో సెంటర్ ను ఏర్పాటు చేయడం శుభసూచికమన్నారు.
తన చేతుల మీదుగా నేడు శివ జ్యోతి భవన్ మెడిటేషన్ సెంటర్ ను ప్రారంభించుకోవడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజయోగి బికే రామ్ నాథ్ బాయి మరియు బ్రహ్మకుమారిలు, నాయకులు పాల్గొన్నారు.