Home / NATIONAL / అమిత్ షా కు షాకిచ్చిన బీఆర్ఎస్ నేతలు

అమిత్ షా కు షాకిచ్చిన బీఆర్ఎస్ నేతలు

 కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిన్న శనివారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పర్యటనకు విచ్చేసిన సంగతి విదితమే. హైదరాబాద్ హాకీంపేటలో దిగిన కేంద్ర మంత్రి అమిత్ షా కు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి.. ఎమ్మెల్యే ఈటల రాజేందర్  తదితరులు ఘన స్వాగతం పలికారు.

అయితే బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు మాత్రం ఆయనకు వినూత్నంగా స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో.. బీఆర్ఎస్ హోర్డింగులు కలకలం రేపుతున్నాయి.

నిన్న శనివారం నగరంలో  టైడ్ పేరుతో పోస్టర్లు వేశారు.. ఇవాళ  ఆదివారం నిర్మా పేరుతో పోస్టర్లు ఏర్పాటు చేసి అమిత్ షా కు స్వాగతం పలుకుతున్నట్లు అందులో పేర్కొన్నారు.

బీజేపీలో చేరితో కేసులు మాఫీ అనే అర్థంలో సుజనా చౌదరి, సువెందు అధికారి, జ్యోతిరాధిత్య సింధియా, బిశ్వశర్మ, నారాయణ్ రానే సహా పలువురి ఫొటోలను పోస్టర్ లో ఉంచింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat