తెలంగాణలో రెండో విడత గొర్రెల పంపిణీని అంబేడ్కర్ జయంతి రోజు అయిన ఏప్రిల్ 14న ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో 3.93 లక్షల మందికి 82.64 లక్షల గొర్రెలను పంపిణీ చేశారు. రెండో విడతలో 3.38 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించారు.
ఈ గొర్రెలను ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా నుంచి కొనుగోలు చేయనుంది. ఒక యూనిట్ కింద లబ్ధిదారులకు 20 ఆడ, 1 మగ గొర్రెను ప్రభుత్వం ఇస్తోంది.