Home / POLITICS / Kcr Government : ప్రభుత్వ స్థలాల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న పేదలకు ఆ స్థలాలను క్రమబద్ధీకరణ చేయనున్న ప్రభుత్వం..

Kcr Government : ప్రభుత్వ స్థలాల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న పేదలకు ఆ స్థలాలను క్రమబద్ధీకరణ చేయనున్న ప్రభుత్వం..

Kcr Government తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల యొక్క సంక్షేమమే లక్ష్యంగా ముందుకు కొనసాగుతుంది. కెసిఆర్ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి తెలంగాణ అభివృద్ధినీ దేశమంతా మాట్లాడుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల హక్కులను కాపాడేందుకు ఒక్క అవకాశాన్ని విడవడం లేదు. కాగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పేదరిక సంక్షేమానికి సంబంధించి మరొక నిర్ణయాన్ని తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ స్థలాల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న పేదలకు ఆ స్థలాలను క్రమబద్ధీకరణ చేసుకోవడానికి ప్రభుత్వం మరొక అవకాశాన్ని కల్పించింది.

ఎంతోకాలంగా పట్టణంలో ప్రభుత్వ స్థలాల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న పేదలకు ఆ స్థలాలను క్రమబద్ధీకరణ చేసుకోవడానికి ప్రభుత్వం మరొక అవకాశాన్ని కల్పించింది. వారి నుండి మరొకసారి దరఖాస్తులను వినతి పత్రాలను స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో వారు ఇచ్చిన దరఖాస్తులు ఏమైనా దిద్దుబాట్లు తప్పులు ఉంటే వాటితో సరిదిద్దుకోవచ్చని స్పష్టం చేసింది.

ఈ విషయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జీవో 58, జీవో 59 ప్రకారం భూముల క్రమబద్ధీకరణ హక్కుల బదలాయింపు మరొకసారి దరఖాస్తు చేసుకునేందుకు పేద ప్రజలకు అవకాశాన్ని కల్పించింది. ఇవే కాకుండా సింగరేణి సంస్థకు సంబంధించిన భూముల్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటే పేద ప్రజలకు మరొకసారి క్రమబద్ధీకరణ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశాన్ని కల్పించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై రాష్ట్రవ్యాప్తంగా పేద ప్రజలు, ప్రభుత్వ స్థలాల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న ప్రజలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat