తెలంగాణ రాష్ట్రంలోని వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలో పర్వతగిరి మండలం హట్య తండాకు చెందిన బాదవత్ అనిల్ ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించారు. బీఆర్ఎస్ పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకున్న వీరికి పార్టీ సభ్యత్వం ద్వారా మంజూరైన 2 లక్షల రూపాయల పార్టీ ఇన్సూరెన్స్ చెక్కును బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్బంగా క్రియాశీల సభ్యత్వం ద్వారా 2లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్కును అందచేసిన ఎమ్మెల్యే అరూరి రమేష్ గారికి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియచేశారు..ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాతినిధులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..