ఏపీలో నిన్న ఎమ్మెల్యే కోటాలో ఎన్నికలు జరిగిన సంగతి తెల్సిందే. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ ఏడు స్థానాలు.. ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ ఒక స్థానంలో గెలుపొందాయి.
దీంతో శాసన మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58. తాజాగా జరిగిన స్థానిక సంస్థలు, టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత వైసీపీ బలం భారీగా పెరిగి 44కు(గవర్నర్ కోటాతో కలిపి) చేరనుంది.
ప్రధానప్రతిపక్షమైన టీడీపీ సభ్యుల సంఖ్య 17 నుంచి 10కి తగ్గనుంది. పీడీఎఫ్ బలం ఐదు నుంచి మూడుకు పరిమితమైంది. బీజేపీకి ఉన్న ఒక్క ఎమ్మెల్సీ పదవీకాలం త్వరలో ముగియనుంది. దీంతో ఆ పార్టీ మండలిలో ప్రాతినిధ్యం కోల్పోయింది.