బెజ్జంకి మండలంలోని తోట పల్లి గ్రామంలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని గౌరవ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ మరియు శాసనసభ్యులు డా రసమయి బాలకిషన్ గారు, సిద్దిపేట జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి వెలేటి రోజా రాధక్రిష్ణ శర్మ గారితో కలిసి ప్రారంభించారు.అనంతరం డా రసమయి బాలకిషన్ గారు మాట్లాడుతూ “అంధత్వ రహితమే లక్ష్యంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టామని,పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని అందరూ ముందుకు తీసుకెళ్లాలని, ప్రజల దగ్గరికి ప్రభుత్వం వస్తోంది..
తెలంగాణ ఏం చేస్తే దేశం అదే అనుసరిస్తుందని, దేశానికి దిక్చుచిలా తెలంగాణ ఉందని,కేసీఆర్ తెలంగాణ ప్రతిష్ట, గౌరవం పెంచడంతో పాటు ప్రజలకు సేవ చేస్తున్నారని,మన రాష్ట్రంలో అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయని ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయనీ,పలు రాష్ట్రాల ముఖ్య మంత్రులు మన కార్యక్రమాలను మేచుకొన్నారని, కంటి చూపుతో బాధపడే వారి జీవితంలో ఈ కార్యక్రమం వెలుగు నింపుతుందని” తెలిపారు.
సిద్దిపేట జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి వెలేటి రోజా రాధకృష్ణ శర్మ గారు మాట్లాడుతూ “రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని,ఇంటింటికి కంటి వెలుగు అనే కార్యక్రమాన్ని తీసుకువచ్చిన గౌరవ సీఎం కేసీఆర్, గౌరవ మంత్రి వర్యులు తన్నీరు హరీశ్ రావు గార్లకు కు కృతజ్ఞతలు” తెలుపుతున్నామన్నారు.