కేంద్ర ప్రభుత్వ పరిధిలో సర్కారు కొలువులు చేస్తోన్న ఉద్యోగులకు ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం షాకిచ్చింది. ఇందులో భాగంగా కాలపరిమితికి మించి డిప్యుటేషన్ పై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇతర శాఖల్లో కొనసాగితే క్రమశిక్షణ చర్యలు తప్పవని బీజేపీ ప్రభుత్వం హెచ్చరించింది.
డిప్యుటేషన్లపై సమీక్ష చేయాలని, కాలపరిమితి మించిన తర్వాత డిప్యుటేషన్పై ఉద్యోగులు కొనసాగకుండా చూడాలని అన్ని శాఖలను ఆదేశించింది. రాతపూర్వక అనుమతి ఇస్తే తప్ప డిప్యుటేషన్ పై కొనసాగవద్దు. అలానే కొనసాగితే రిలీవ్ అయినట్లే భావించాల్సి ఉంటుందని తెలిపింది.