దేశవ్యాప్తంగా కరోనా పాజిటీస్ కేసులు మళ్లీ పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. కొత్తగా 3,095 కరోనా కేసులు నమోదు కాగా, గత 24 గంటల్లో ఐదుగురు చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 15,208కి చేరింది. ఇప్పటి వరకు 5,30,867 మంది కరోనా కారణంగా మరణించగా… ముందు జాగ్రత్తగా కరోనా టెస్టులు పెంచాలని కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలను ఆదేశించింది.