తెలంగాణ సంచలనం సృష్టించిన టెన్త్ పేపర్ లీకేజీ కేసులో బీజేపీ ఎమ్మెల్యే .. మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో పాటు ఆయన ఇద్దరు పీఏలకు వరంగల్ పోలీసులునోటీసులు జారీ చేశారు.
పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించిన రిమాండ్ రిపోర్టులో కరీంనగర్ ఎంపీ.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ను ఏ1గా, బూర ప్రశాంత్ను ఏ2గా చేర్చిన సంగతి తెలిసిందే.
అయితే ఏ2 ప్రశాంత్.. బండి సంజయ్తో పాటు ఈటల రాజేందర్కు, ఆయన ఇద్దరు పీఏలు రాజు, నరేందర్కు కూడా హిందీ ప్రశ్నపత్రం వాట్సాప్ ద్వారా పంపాడు. దీంతో వారి పేర్లను కూడా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్తో పాటు ఆయన ఇద్దరు పీఏలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.ఈటల రాజేందర్, ఆయన పీఏలు రాజు, నరేందర్ వాంగ్మూలాన్ని కూడా నమోదు చేస్తామని వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు.