ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి రైల్వేస్టేషన్లో రాజధాని ఎక్స్ప్రెస్కు ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ రైలులోని బీ-5 బోగీ వద్ద పొగలు వచ్చాయి.
దీంతో కావలి వద్ద 20 నిమిషాలపాటు రైలు నిలిచిపోయింది. రైలులో పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అయితే బ్రేక్ ఫెయిల్ కావడంతోనే పొగలు వచ్చినట్లు కావలి రైల్వేస్టేషన్ సూపరింటెండెంట్ శ్రీహరి రావు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదని చెప్పారు. మరమ్మతుల తర్వాత రైలు అక్కడి నుంచి వెళ్లిపోయింది.