తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల టీఎస్పీఎస్సీ నిర్వహించిన సీడీపీవో , గ్రేడ్ 1 సూపర్వైజర్ నియామక పరీక్షలపై ఈ రోజు సోమవారం హైకోర్టు లో పిటిషన్ వేశారు. సీడీపీవో, గ్రేడ్ 1 సూపర్వైజర్ నియామక పరీక్షలు రద్దు చేయాలని ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ , 76 మంది అభ్యర్థులు పిటిషన్లు వేశారు.
సీడీపీవో, గ్రేడ్ 1 సూపర్వైజర్ ప్రశ్నపత్రాలపై కూడా దర్యాప్తు జరపాలని పిటిషన్లో కోరారు. జనవరిలో సీడీపీవో, గ్రేడ్ 1 సూపర్వైజర్ నియామక పరీక్షలు టీఎస్పీఎస్సీ నిర్వహించింది.
తాము వేసిన పిటిషన్పై తీర్పు వచ్చే వరకు నియామక ప్రక్రియపై స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. ఈ పిటిషన్లపై హైకోర్టు సోమవారం విచారణ చేయనుంది.