తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళుతుందని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. లక్షెట్టిపేట మున్సిపల్ కార్యాలయ ప్రాంగణములో పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తున్నదని చెప్పారు. బతుకమ్మ పండుగ కి ఆడబిడ్డలకు చీరలు పంపిణీ చేస్తున్నట్లు రంజాన్ క్రిస్మస్ పండుగలకు దుస్తులు అందిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో DCMS చైర్మన్ తిప్పని లింగన్న, మున్సిపల్ చైర్మన్ నలమాస్ కాంతయ్య,వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్,పట్టణ కౌన్సిలర్లు,ముఖ్యనాయకులు తదితరులు పాల్గొన్నారు..