కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 44వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ నగర్, సురేందర్ నగర్ కాలనీల్లో మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ గారితో కలిసి పాదయాత్ర చేస్తూ దాదాపు 85 శాతం వరకు పూర్తి చేసిన అభివృద్ధి పనులు పరిశీలించారు.
కాగా మిగిలి ఉన్న భూగర్భడ్రైనేజీ, డ్రైనేజీ పూర్తైన వెంటనే సీసీ రోడ్లు, ట్రాన్స్ఫార్మర్ బదిలీ వంటి సమస్యలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాగా.. అక్కడే ఉన్న అధికారులకు ఎమ్మెల్యే గారు ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా త్వరితగతిన చర్యలు చేపట్టాలన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సూర్యప్రభ, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ సోమేశ్ యాదవ్, స్థానిక డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దేవరకొండ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, సీనియర్ నాయకులు కిషోర్ చారి, సురేందర్ రెడ్డి, బాలయ్య, శివారెడ్డి, కొత్త నర్సింహా రెడ్డి, మధుకర్ రెడ్డి, నసీర్, వెంకటేష్, అజయ్ మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.