కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ ఎంజేఎస్ గార్డెన్ లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని ముస్లీం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది.
ఈ విందులో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన ముస్లీం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లీం సోదరులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ మాజీ ప్రజా ప్రతినిధులు, నిజాంపేట్ బీఆర్ఎస్ అధ్యక్షుడు, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు, డివిజన్ల అధ్యక్షులు, మైనార్టీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, మజీద్ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.