Home / HYDERBAAD / అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట…

అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట 126 డివిజన్ పరిధిలోని రింగ్ బస్తీలో శ్రీ శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద రూ.20 లక్షల సీడీపీ నిధులతో నూతనంగా చేపడుతున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు ఈరోజు ఎమ్మెల్సీ మధుసూధనా చారి గారు, ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని శంఖుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ శుభకార్యాలకు ప్రజలకు ఎంతో ఉపయోగ పడేలా కమ్యూనిటీ హాల్ పనులకు భూమి పూజ చేయడం పట్ల సంతోషంగా ఉందని పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని చెప్పారు.

గతంలో ఎన్నడూ జరగని విధంగా అన్ని కులాల వారికి బీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించి కోట్ల రూపాయల విలువ చేసే భూములను కేటాయించి ఆత్మ గౌరవ భవనాలు నిర్మిస్తోందని గుర్తు చేశారు. రాజకీయ పరంగా అవకాశాలు కూడా కల్పిస్తున్న నాయకుడు సీఎం కేసీఆర్ గారని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ మాతృ సంఘం అధ్యక్షుడు మదన్మోహన్, లాల్ కోట వెంకటాచారి, శ్రీనివాస్ ఆచారి, హనుమంత్ చారి, బిక్షపతి చారి, నందిపేట రవీంద్ర చారి, వైర్ రాజశేఖర్ చారి, కిషోర్ చారి, వెంకటేష్ చారి, బాలరాజ్, విష్ణు చారి, దరువు అంజయ్య మరియు కుత్బుల్లాపూర్ విశ్వ కర్మ సంఘం అధ్యక్షులు, వివిధ సంఘాల వారు మరియు స్థానిక డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat