Home / MOVIES / ఆ కోరిక తీరలేదంటున్న బుట్ట బొమ్మ

ఆ కోరిక తీరలేదంటున్న బుట్ట బొమ్మ

అది బాలీవుడ్ అయిన టాలీవుడ్ అయిన ఏ భాషలో మూవీ అయిన కానీ కథను నడిపించగల సమర్థుడు కథానాయకుడు. నాయికకు అంత ప్రాధాన్యత ఉండదు. ఎక్కువశాతం ఈ నాయికలు ఆటపాటలకే పరిమితమవుతుంటారు.

అతి కొద్ది సందర్భాల్లో కథలో కీలకంగా వాళ్ల పాత్రలుంటాయి. అందుకే నాయిక ప్రధాన చిత్రాల్లో నటించాలనే కోరికతో ఈ అందాల తారలు ఉవ్విళ్లూరుతుంటారు. అలాంటి కోరిక తనకూ ఉందని చెప్పుకుంది బెంగళూరు బ్యూటీ పూజా హెగ్డే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ…‘నా కెరీర్‌ ప్రారంభం నుంచీ అనేక కమర్షియల్‌ చిత్రాల్లో నటించాను.

గ్లామర్‌ తారగా పేరు తెచ్చుకున్నాను.అయితే నటిగా పూర్తిస్థాయి నటన చూపించే అవకాశం కోసం నేనూ ఎదురుచూస్తున్నా. అది నాయిక ప్రధాన చిత్రాలతోనే సాధ్యం. వీలు కుదిరితే త్వరలో ఓ ఫీమేల్‌ ఓరియెంటెడ్‌ మూవీలో నటిస్తా’ అని చెప్పింది. సల్మాన్‌ సరసన పూజా హెగ్డే నటించిన ‘కిసీ కా భాయ్‌ కిసీ కి జాన్‌’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఆమె మహేష్‌ బాబు – త్రివిక్రమ్‌ చిత్రంతో పాటు సల్మాన్‌ ఖాన్‌తో ‘భజ్రంగీ భాయిజాన్‌’ సీక్వెల్‌ ‘పవన పుత్ర’లోనూ నటించనుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat