ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. ప్రధానప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రముఖ సినీ నటుడు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్ధతుగా నిలిచారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతాంగం నష్టపోతుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదని ఆరోపించారు.
‘మంత్రులు ఒక్క చోట కూడా రైతుల దగ్గరకు, పొలాల్లోకి వెళ్లి ఆరా తీయడం లేదు. ఇక సీఎం సంగతి సరేసరి. రజనీకాంత్ను తిట్టడం కాదు.. ధాన్యం రైతుల కష్టాలు చూడండి. పవన్ కళ్యాణ్ను ఆడిపోసుకోవడం కాదు.. మిర్చి రైతుల బాధలు వినండి. విపక్ష నేతల అరెస్టులు కాదు.. కర్షకులకు భరోసా ఇవ్వండి’ అని ట్వీట్ చేశారు.