గతంలో పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు అనేక కష్టాలు పడ్డారు. అయితే ఈసారి కూడా అలాంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా అనే అపోహ ప్రజల్లో నెలకొంది. అయితే సామాన్య ప్రజలకు ఇబ్బంది ఉండదని అర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బ్లాక్ దందాలు చేసే వారిపై ఎఫెక్ట్ ఉంటుందని చెబుతున్నారు. ఏది ఏమైనా తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకోవడానికి బ్యాంకుల వద్దకు ప్రజలు క్యూ కట్టాల్సిందేనంటున్నారు.