Breaking News
Home / SLIDER / రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం

రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం జగిత్యాల వారి ఆధ్వర్యంలో రైతు సోదరులకు PACS కేంద్రంలో సబ్సిడీపై జీలుగ,జనుము విత్తనాలను పంపిణీ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ గారు,జెడ్పీ చైర్ పర్సన్.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం పంటలు వేసే ముందు, భూసారం పెంచేందుకు ప్రతి యేటా రైతులకు పచ్చిరొట్ట ఎరువులుగా ఉపయోగపడే జీలుగు , జనముల విత్తనాలు వ్యవసాయ శాఖ ద్వారా పిఎసిఎస్ వారి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరుగు తుందని వారు తెలిపారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారు రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు…ఈ కార్యక్రమంలో PACS చైర్మన్ మహిపాల్ రెడ్డి,ఎంపీపీ లక్ష్మి,ZPTC మహేష్,కౌన్సిలర్ సమిండ్ల వాణి శ్రీనివాస్,మాజీ AMC ఛైర్మెన్ దామోదర్ రావు, కల్లెడ పాక్స్ ఛైర్మెన్ సందీప్ రావు,రైతు బంధు జగిత్యాల రూరల్,అర్బన్ మండల కన్వీనర్ లు నక్కల రవీందర్ రెడ్డి, జుంబర్తి శంకర్,PACS వైస్ చైర్మన్ సురేందర్,PACS డైరెక్టర్లు, సర్పంచులు,ఎంపీటీసీ లు,కౌన్సిలర్లు కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino