Breaking News
Home / SLIDER / 58,59 GO పట్టాల కోసం దరఖాస్తు చేసుకోవాలి

58,59 GO పట్టాల కోసం దరఖాస్తు చేసుకోవాలి

బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఇంచార్జీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని వార్డ్ – 3,ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేష్ గారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2001 లో జల దృశ్యం నుండి తన ప్రస్థానం మొదలైంది అని, ఉద్యమ సమయంలో అనేక ఒడిదుడుకలను ఎదురుకున్నామని, కంటోన్మెంట్ నియోజకవర్గం అనేక ఉద్యమాలు ఉధృతం చేశామని నాటి జ్ఞాపకాలను గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సిఎం కేసిఆర్ గారు అవలంభిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ, అలాగే ప్రభుత్వ స్థలంలో నివసిస్తున్న వారు 58,59 GO పట్టాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

పేద ప్రజల కోసం ఎన్నో ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సిఎం కేసిఆర్ గారికి ధన్యవాదాలు తెలిపారు. వార్డ్ – 3, సమావేశానికి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొనడం ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది అని అన్నారు. ఇదే ఉత్సాహంతో కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఏ ఎన్నికలు జరిగినా భారీ మెజార్టీతో విజయం సాధించి సిఎం కేసిఆర్, కేటీఆర్ గారికి బహుమతిగా ఇవ్వాలని సూచించారు .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino