Home / SLIDER / రాష్ట్ర ప్రగతిని చాటేలా దశాబ్ది ఉత్సవాలు

రాష్ట్ర ప్రగతిని చాటేలా దశాబ్ది ఉత్సవాలు

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 9 సంవత్సరాలు నిండి 10 వ వసంతం లోకి అడుగు పెడుతున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సూచనలు, ఆదేశాల మేరకు జూన్ 2 నుండి 22 వరకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జిల్లాలో పండుగ వాతావరణం లో ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు .అమరుల ఆశయాల కనుగునంగా తెలంగాణను తీసుకురావడం జరిగిందని, ఈ 9 సంవత్సరాల లో ప్రపంచం లోనే ఎక్కడా లేని విధంగా వినూత్న పథకాలు అమలు చేస్తూ అన్ని రంగాలలో రాష్ట్రం అధ్భుత ప్రగతి సాధించింది అగ్ర భాగాన నిలిచిందని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ తొమ్మిదేళ్లలో సాధించిన విజయాలను,ప్రగతి ని ప్రతి ఒక్కరికి తెలియజెప్పేలా ఉత్సవాలను పండుగ వాతావరణం లో ఘనంగా నిర్వహించాలని అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు,ప్రజలు అందరి సహకారంతో భాగస్వామ్యులను గ్రామ,పట్టణ స్థాయి లో చేస్తూ ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ విషయమై నల్గొండ,సూర్యాపేట, యాధాధ్రి భువనగిరి జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులతో మంగళ వారం యాదాద్రి భువనగిరి జిల్లా సమీకృత జిల్లా అధికారుల భవన సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన సన్నాహక సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు.

రాష్ట్రం ఏర్పాటు కోసం ఎన్నో ఉద్యమాలు నిర్వహించారని,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ఎన్నో అణచి వేత లు,అవమానాలు గురై అభివృద్ధి లో వెనుక బాటు కు గురైందని అన్నారు.2001 సంవత్సరం లో అందరి భాగస్వామ్యం తో అహింసా,ప్రజాస్వామ్య పద్దతి లో కె.చంద్ర శేఖర్ రావు నేతృత్వం లో డా.బి.అర్. అంబేడ్కర్ రాజ్యాంగం కనుగుణంగా పార్ల మెంట్ చట్టం ద్వారా రాష్ట్రం సాధించు కున్నామని అన్నారు.సాధించిన తెలంగాణ రాష్ట్రం 9 సం.ల కాలం లో కె.సి.అర్ అధ్భుత పరిపాలన తో రాష్ట్రం అనేక రంగాల్లో విజయాలు సాధించి మంచి పరిపాలన దక్షుడు విమర్శకుల ప్రశంసలు పొందారని అన్నారు.వ్యవసాయ రంగం లో రైతాంగానికి విశ్వాసం కలిగించారని,టి.ఎస్. ఐ.పాస్ ద్వారా పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి కల్పించామని,తలసరి ఆదాయం లో దేశం లో రాష్ట్రం నెంబర్ 1 గా ఉందని తెలిపారు.
కాకతీయుల కాలం లో వ్యవసాయ రంగం లో వెలుగొందిన జిల్లా ఉమ్మడి రాష్ట్రం లో 70 సం.లు గా వ్యవ సాయం సంక్షోభం లో కూరుకు పోయింది.రాష్ట్రం ఏర్పాటు తర్వాత వ్యవసాయ రంగం లో ఎక్కువ లాభ పడిన జిల్లా నల్గొండ జిల్లా తెలిపారు.రాష్ట్రం ఏర్పడక ముందు 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేసిన ఉమ్మడి జిల్లా గత 4 సం.లుగా 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేసి దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ గా ఎదిగిందని అన్నారు.
తర్వాత 9 ఏళ్లలో అన్ని రంగాలలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఎంతో ప్రగతిని సాధించడం జరిగిందని, ఉపాధితో పాటు, ఉద్యోగం ,వ్యవసాయం, వైద్యం లో, శాంతిభద్రతలు, పారిశ్రామిక రంగం, వ్యవసాయం ఇలా ఒకటేమిటి అన్నిరంగాలు అభివృద్ధిలో ముందున్నాయని, 2014 కు పూర్వం తెలంగాణ, 2014 తర్వాత తెలంగాణను కళ్లకు కట్టినట్టుగా ప్రజలందరికీ తెలియజేపే బాధ్యత ప్రజాప్రతినిధులతో పాటు, అధికారులందరిపై ఉందని ఆయన అన్నారు.

ఉత్సవాలలో భాగంగా రోజువారి నిర్వహించే కార్యక్రమాలపై మంత్రి పలు సూచనలు చేస్తూ ఉత్సవాలను అధికారులు తమదిగా తీసుకొని నిర్వహించాలని,, అన్ని కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులను,రైతాంగం ను,ప్రజలను భాగస్వామ్యం చేయాలని, సంబంధిత శాసన సభ్యులు ఇతర ప్రజాప్రతినిధుల సమ్మతితో,అందరినీ భాగస్వామ్యులను చేస్తూ కార్యక్రమాలను నిర్వహించాలని, అన్ని శాఖలు గత తొమ్మిది సంవత్సరాలలో సాధించిన ప్రగతిని నివేదికల రూపంలో తయారు చేయాలని, ఈ సమాచారం మొత్తం జూన్ రెండు లోపు ప్రజాప్రతినిధులందరికీ సమర్పించాలని ఆదేశించారు. తెలంగాణ రైతు దినోత్సవం మొదలుకొని జూన్ 22 న నిర్వహించే అన్ని కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలని, తెలంగాణ సాహిత్య దినోత్సవం సందర్భంగా కవులను, సత్కరించాలని, తెలంగాణ గిరిజన ఉత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గిరిజనులను పిలిచి కార్యక్రమాలు నియోజక వర్గ,జిల్లా స్థాయి లో నిర్వహించాలని అన్నారు తెలంగాణ మంచినీళ్ల పండుగ సందర్భంగా అన్ని వాటర్ ట్యాంకుల వద్ద గతంలో నీటి కోసం మహిళలు పడిన ఇబ్బందులు, ప్రస్తుత పరిస్థితి పై నాడు- నేడు ఫోటోలతో సహా తెలియజేసే ప్రయత్నం చేయాలని,మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా ప్లోరో సిస్ సమూలంగా నిర్మూలించామని,ఇది గొప్ప విజయ మని, ప్లెక్సీ లు రాష్ట్ర,జిల్లా ప్రగతి ని వివరిం చేలా ఏర్పాటు చేయాలని సూచించారు.
ప్రతి శాఖ ఉత్సవాలను ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఉత్సవాల నిర్వహించాల్సిందిగా ఆయన కోరారు. ప్రతి శాఖ ద్వారా నాడు -నేడు పరిస్థితిని ఫోటోల ద్వారా వివరించాలన్నారు.ఆయా శాఖల్లో బాగా పని చేసి ఉత్తమ ప్రతిభ కనబర్చిన అర్హులైన వారికే అవార్డ్ లు, ప్రశంసా పత్రాలు అందచేయాలన్నారు.

నల్గొండ జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి,యాదాద్రి భువన గిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సూర్యా పేట కలెక్టర్ వెంకట రావు లు,ఎస్.పి.లు అపూర్వ రావు,రాజేష్ చంద్ర
రాజేంద్ర ప్రసాద్, మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన సూచనలు, ఆదేశాలను పాటిస్తూ ఉత్సవాల నిర్వహణ పై తీసుకున్న చర్యలను వివరించారు.. అదే విధంగా ఆయా తేదీలలో నిర్వహించనున్న కార్యక్రమాల సందర్భంగా అవసరమైన ఏర్పాటు, ఆయా రోజుల వారి నిర్వహించే కార్యక్రమాలపై అధికారులకు ఇదివరకే ఆదేశించడం జరిగిందని, అధికారులతో పాటు, ప్రజా ప్రతినిధులు అందరు ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
సమావేశం లో పాల్గొన్న పలువురు శాసన సభ్యులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇన్ని రోజులు చేసిన పనిని గొప్పగా చెప్పుకునేందుకు ఇది చక్కటి అవకాశం గా మార్చుకోవాలని, అలాగే ఈ ఉత్సవాలు ప్రజాప్రతినిధులకు కూడా మంచి అవకాశం అని సలహాలు,సూచనలు అంద చేశారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత,కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి,రాష్ట్ర గీత కార్మికుల సహకార సంఘం చైర్మన్ పల్లె రవి కుమార్,రాష్ట్ర గొర్రెల పెంపకం సహకార సంస్థ చైర్మన్ మేకల బాల రాజు యాదవ్, ట్రై కార్ చైర్మన్ రాం చంద్ర నాయక్,రాజ్య సభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,యాదాద్రి భువనగిరి జడ్.పి.చైర్మన్ సందీప్ రెడ్డి,శాసన సభ్యులు రవీంద్ర కుమార్,పైళ్ళ శేఖర్ రెడ్డి,భాస్కర్ రావు,బోల్లం మల్లయ్య యాదవ్, చిరుమర్తి లింగయ్య ,నోముల భగత్,నల్గొండ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అర్.మల్లికార్జున రెడ్డి,
మున్సిపల్ చైర్మన్ లు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat