Home / ANDHRAPRADESH / టీడీపీ మానిఫెస్టో తో వైసీపీ గుండెల్లో భయం మొదలైంది

టీడీపీ మానిఫెస్టో తో వైసీపీ గుండెల్లో భయం మొదలైంది

 ఏపీ మాజీ ముఖ్యమంత్రి… టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల జరిగిన మహానాడులో   ప్రకటించిన మానిఫెస్టో తో వైసీపీ నేతలు   గింగిరాలు తిరుగుతున్నారని, అందుకే చంద్రబాబు, లోకేష్‌  పై పిచ్చి వాగుడు వాగుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ   అన్నారు.

మంగళవారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ మాయల పకీర్ కారుమూరి నాగేశ్వరరావు   తన పని సక్రమంగా చేయకుండా కారుకూతలు కూస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ మానిఫెస్టో టిష్యూ పేపర్ లాంటిదని, దానిని ప్రజలు ఏనాడో చించేశారన్నారు.

అంబటి రాంబాబు  మంత్రిగా ఏం చేశారని ఆమె ప్రశ్నించారు. పోలవరం డీపీఆర్ ఆమోదించటం చేతకాదని, నిర్వాసితులకు ఇళ్లు కట్టలేదని, పరిహారం ఇచ్చే దమ్ము లేదు.. కానీ సిగ్గులేకుండా చంద్రబాబు గురించి మాట్లాడుతారా? అంటూ దుయ్యబట్టారు. మృతుల కుటుంబాల దగ్గర వాటాలు అడిగిన నీచచరిత్ర అంబటిదని, మంత్రిగా ఏనాడైనా ఏ ప్రాజెక్టు దగ్గరకైనా వెళ్లి సమీక్ష చేశారా? అని నిలదీశారు. పోలవరంకు ఎన్ని గేట్లుంటాయో తెలుసా? సుజల స్రవంతి అడ్రస్ ఎక్కడుందో తెలుసా? అని ఆమె ప్రశ్నించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat