ఏఐటీయూసీ మున్సిపల్ స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ గాజులరామారం జంట సర్కిల్ లయందు పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై వినతి పత్రం అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ జిల్లా అధ్యక్షులు రాములు ఏఐటీయూసీ అధ్యక్షులు కే స్వామి ఏఐటీయూసీ కుత్బుల్లాపూర్ నియోజక వర్గం అధ్యక్షులు vహరినాథ్ రావు కార్యదర్శి వి శ్రీనివాసులు హాజరై మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల అటెండెన్స్ సమయం 5: నుండి 6 గంటల వరకు గతంలో ఉండేది అదే సమయాన్ని కొనసాగించాలని కోరుచున్నాము.
మరియు, అన్ని గ్రూపులలో ఏడు మందికి తక్కువగా ఉన్న సిబ్బందిని భర్తీ చేయాలి ఈ పది సంవత్సరాల కాలంలో జనాభా విస్తీర్ణం చాలా పెరిగినది పనికి తగ్గ సిబ్బంది లేకపోవడంతో అటు బస్తీ ప్రజలకు ఇబ్బంది ఇటు కార్మికులకు భారంగా మారింది అన్నారు కావున పారిశుద్ధ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించగలరని కోరుచున్నాము ఏఐటియుసి మున్సిపల్ స్టాఫ్ అండ్ ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ద్వారా తెలియపరచుకుంటున్నాము.