కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డిని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ మరోసారి దుమ్ముదులిపారు.రేవంత్ రెడ్డి ఒక జోకర్.. ఒక బ్రోకర్ అని ఎద్దేవా చేశారు. నిన్న పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర నిర్వహించింది.ఈ యాత్రలో భాగంగా బహిరంగ సభలో రేవంత్ చేసిన వాఖ్యలపై ఎర్రబెల్లి స్పందించారు. ఇవాళ వరంగల్ నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..రేవంత్రెడ్డిని నేనే జైల్లో పెట్టించానంటున్నాడు. జైళ్లో నుంచి రాగానే నా ఇంటికి …
Read More »పెంచిన తల్లిప్రేమే గెలిచింది..!!
రెండేళ్ళు ఎంతో అల్లారుగా ,ప్రేమతో పెంచిన తల్లికే చిన్నారి తన్విత చేరింది.తన్విత ను కన్న తల్లి కాదనుకున్న.. ప్రేమగా పెంచిన తల్లి తన ప్రేమతో గెలిచింది. వివరాల్లోకి వెళ్తే..గత కొన్ని రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన చిన్నారి తన్విత ఉదంతంలో పెంచిన తల్లికి ఊరట లభించింది.మహబూబా బాద్ జిల్లాకు జిల్లాకు చెందిన బావుసింగ్, ఉమ దంపతులకు ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు.అయితే మళ్లి ఆడపిల్ల పుడుతుందని …
Read More »నేర్చుకో బాబు.. కేసీఆర్ ఢిల్లీ పొగరు వంచితే..నువ్వు వంగిపోయావు
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబుపై ఇటు విపక్ష నేతలతో పాటుగా అటు పలువురు స్వపక్ష టీడీపీ నేతలు సైతం చంద్రబాబు తీరును తప్పుపడుతున్నారని ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ప్రజల తరఫున గళం వినిపించడం, ప్రజల ఆకాంక్షను నెరవేర్చడం అనేది తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను చూసి నేర్చుకోవాలంటున్నారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు తీరు ఆకాంక్షలు నెరవేర్చేలా లేదని తన స్వలాభం కోసం …
Read More »జగ్జీవన్ రామ్ చేసిన కృషి మరువలేనిది..సీఎం కేసీఆర్
స్వతంత్ర భారత్ ను ఈ దేశ సామాజిక స్థితిగతులకు సరిపోయేలా తీర్చిదిద్దడం లో బాబు జగ్జీవన్ రామ్ గారి కృషి ఎంతో వుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు . నేడు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని దేశానికి ఆయన చేసిన సేవలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకున్నారు.ఆయన దళితుల కోసం చేసిన సేవలు మరువలేనివని అన్నారు. స్వాతంత్ర సమరయోధుడి గా, సంఘసంస్కర్తగా , ప్రజా …
Read More »ఢిల్లీ నుంచి వచ్చేయండి..ఎంపీలకు సీఎం కేసీఆర్ ఆదేశం..!!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు టీఆర్ఎస్ ఎంపీలకు కీలక సూచన చేశారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న మలి విడుత బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంటు ఉభయసభలు కొన్ని గంటలు కూడా సాగని సంగతి తెలిసిందే. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగని నేపథ్యంలో ఎంపీలు ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరి రావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.గురువారం, శుక్రవారం జరుగనున్న పార్లమెంటు సమావేశాలకు హాజరుకావద్దని ఎంపీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. సభలో ఎలాంటి …
Read More »స్వీటీతో కేటీఆర్..పిక్ ఆఫ్ ది డే..!!
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ వరంగల్ మహానగరంలో పర్యటించిన విషయం తెలిసిందే.ఈ పర్యటనలో భాగంగా మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మొదటగా కుడా కార్యాలయంలో జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలి, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. సమీక్షా సమావేశానికి వచ్చిన జిల్లా పోలీసు అధికారులు కూడా స్వీటీ అనే జాగిలాన్ని …
Read More »అన్నదాతకు ఆసరా…రైతుబంధు పథకానికి మార్గదర్శకాల విడుదల
రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతుబంధు పథకం విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉండే విధంగా పథకాన్ని రూపొందించింది. 2018-19 వ్యవసాయ సంవత్సరంలో ఖరీఫ్ సీజన్ నుంచి ఎకరానికి పంటకు రూ.4 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించనున్నది. ఇందుకోసం రాష్ట్ర బడ్జెట్ లో రూ.12 వేల కోట్లు కేటాయించింది. పట్టాదారులకే నేరుగా చెక్కులు అందించనున్నది. ఒక్కో రైతుకు పెట్టుబడి సాయం రూ.50 వేల …
Read More »ఎంపీగా ప్రమాణం చేసిన మొదటిరోజే..సంతన్న కీలక భేటీ
టీఆర్ఎస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన మొదటిరోజే టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. పార్టీ ముఖ్యనేతలతో కలిసి ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిశారు. టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పక్ష నేత జితేందర్ రెడ్డితో పాటు ఢిల్లీలో ఉన్న ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్తో ఎంపీ సంతోష్ కుమార్ కేంద్ర మంత్రిని కలిశారు. షెడ్యూల్ 9, …
Read More »మహబూబాబాద్ను జిల్లాగా చేసిన ఘనత సీఎం కేసీఆర్దే..మంత్రి కేటీఆర్
మహబూబాబాద్ను జిల్లాగా చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ కేటీఆర్ అన్నారు.ఇవాళ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం , మహబూబాబాద్ జిల్లాలో మంత్రులు కేటీఆర్ ,కడియం శ్రీహరి, పర్యటించారు.పర్యటనలో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయానికి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. రాష్ట్రంలోని ఆడబిడ్డల కష్టాలను తీర్చేందుకు ఇంటింటికి మంచినీళ్లు ఇవ్వబోతున్నామని .. ప్రతీ …
Read More »కాంగ్రెస్ కు బిగ్ షాక్..మంత్రి కేటీఆర్ సమక్షంలో 2000మంది కార్యకర్తలు చేరిక
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ వరంగల్ నగరంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.ఈ పర్యటనలో భాగంగా మంత్రి మొదటగా వరంగల్ నగర అభివృద్ధి పై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.అనంతరం నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.ఈ క్రమంలో నర్సంపేట నియోజకవర్గం కాగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు మాజీ ఎంపీపీలు,సర్పంచ్ తో పాటు ముఖ్య నాయకులు ,కార్యకర్తలు 2000మంది కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి …
Read More »