రాష్ట్ర కాంగ్రెస్ నేతలపై మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. రాష్ట్రంలో శాసనసభ లో ప్రశ్నలు అడిగితే సాధారణంగా ప్రభుత్వం పారిపోతుందని… కానీ తెలంగాణలో విచిత్రంగా ప్రతిపక్ష నాయకులు పారిపోయారని ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికలలో బాన్స్ వాడ నియోజకవర్గం నుండి టీడీపీ తరఫున పోటీ చేసిన భోజ్యా నాయక్, గాంధారి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తాన్ సింగ్(కాంగ్రెస్ పార్టీ)తో పాటు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున …
Read More »ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్కు స్వల్ప ఊరట
పౌరసత్వం విషయంలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్కు స్వల్ప ఊరట లభించింది. చెన్నమనేని రమేశ్ భారత పౌరసత్వాన్ని గతేడాది డిసెంబర్ నెలలో కేంద్రం రద్దు చేసిన విషయం విదితమే. పౌరసత్వం రద్దుపై కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను 6 వారాల పాటు హైకోర్టు నిలిపివేసింది. ఈ అంశంపై మళ్లీ వాదనలు వింటామని కోర్టు స్పష్టం చేసింది. పౌరసత్వం రద్దుపై గత ఆగస్టు 31న హోంశాఖ తీర్పునిచ్చినా డిసెంబర్ నెలలో రమేశ్ రివ్యూ …
Read More »ఉద్యోగాల కల్పన వేదికగా..న్యాక్ను తీర్చిదిద్దాలి..మంత్రి తుమ్మల
యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ఏజెన్సీగా జాతీయ నిర్మాణ సంస్థ (న్యాక్)ను తీర్చి దిద్దాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ సంస్థలను పిలిచి సమన్వయం చేసే బాధ్యతలకే పరిమితం కాకుండా నేరుగా నిరుద్యోగ యువతి, యువకులకూ శిక్షణ తీసుకున్న వారికి దేశ, విదేశాల్లో ఉద్యోగాలు కల్పించేలా కార్యాచరణ రూపొందించుకోవాలని నిర్దేశించారు. సచివాలయంలో తన చాంబర్లో న్యాక్ పై మంత్రి తుమ్మల న్యాక్, …
Read More »ఫ్లెక్సీలపై మంత్రి కేటీఆర్ మరోసారి ఆగ్రహం..!
ప్రమాదాలకు, ఇతర సమస్యలకు కారణం అవుతున్న ఫ్లెక్సీలు, భారీ బ్యనర్లకు తెలంగాణ సర్కారు గట్టిగా చెక్ పెడుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఇవాళ మలక్ పేట ఇండో స్టేడియం ప్రారంభం సందర్భంగా జీహెచ్ఎంసీ నిబంధనలకు విరుద్దంగా ఫ్లెక్సీలు కట్టడంపై ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఫొటోతోపాటు పలువురు టీఆర్ఎస్ నేతల ఫొటోలు ఉన్న ఫ్లెక్సీలపై ఆయన కన్నెర్రజేశారు.ఈ ఫ్లెక్సీలను వెంటనే …
Read More »కేసీఆర్.. నెంబర్ వన్ సీఎం..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. దేశంలోనే నెంబర్ వన్ సీఎం అని మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి అన్నారు . రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఎల్బీనగర్ సాహెబ్నగర్లో మంచినీటి రిజర్వాయర్ను మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంబించారు .ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎంపీ మల్లారెడ్డి ప్రసంగించారు. దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్, సీఎం కేసీఆర్ నెంబర్ వన్ అని మల్లారెడ్డి చెప్పారు. ఇంతలోనే మంత్రి కేటీఆర్ …
Read More »పదవులు లేని పార్టీల వల్లే..గిరిజన ఆదివాసీల మధ్య గొడవ..మంత్రి ఈటల
పదవులు లేని..ప్రజలు దూరం పెట్టిన రాజకీయ పార్టీల వల్లే గిరిజనులు ఆదివాసుల మధ్య గొడవలు జరుగుతున్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ గిరిజన విద్యార్థి సంఘం 11 వ వార్షికోత్సవ మహా సభ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగింది. ఈ సభ ముఖ్య అతిథిగా హాజరు అయిన ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రసంగించారు. 11 సంవత్సరాలు ఒక విద్యార్థి …
Read More »వెలుగు జిలుగుల తెలంగాణ..విద్యుత్ ఉద్యోగుల ఘనతే
వెలుగు జిలుగుల తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల వల్లే సాధ్యమయిందని పలువురు వక్తలు ప్రశంసించారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ అకౌంట్స్ స్టాఫ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో 2018 డైరీ అవిష్కరణ జరిగింది. ఈ సభకు శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి ముఖ్యఅతిథిగా హాజరై డైరీ ఆవిష్కరించారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, సీఎండీ రఘుమారెడ్డి ఉద్యోగులు పాల్గొన్నారు. శాసనసభ స్పీకర్ మాదాసుధానాచారి మాట్లాడుతూ `24 గంటల విద్యుత్ ఇస్తున్న మీ అందరికి కృతజ్ఞతలు. ఆనాడు ప్రతి …
Read More »ఎల్బీనగర్ గడ్డను సీఎం కేసీఆర్ ఎప్పటికీ మరిచిపోరు..మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇవాళ పలు అభివ్రద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేసారు. దీనిలో భాగంగా ఎల్బీనగర్ సాహెబ్నగర్లో మంచినీటి రిజర్వాయర్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.. ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ..హైదరాబాద్ మహానగరంలో నీటి ఎద్దడి తీర్చేందుకు రూ. 2 వేల కోట్లతో తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. …
Read More »నిమ్మకాయల చిన్నరాజప్పకు తప్పిన భారీ ప్రమాదం
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, హోం మినిస్టర్ నిమ్మకాయల చిన్నరాజప్పకు భారీ ప్రమాదం తప్పింది.ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటన కోసం విశాఖపట్నం నుంచి నర్సీ పట్నం వెళ్ళుతున్న క్రమంలో తన కాన్వాయ్ లోని ఎస్కార్ట్ వాహనంలోని ఒక వాహనం దగ్ధమైంది. ఈ క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిబ్బంది అప్రమత్తమై డిప్యూటీ సీఎం కారును అపడంతో భారీ ప్రమాదం తప్పింది. అయితే దగ్గదమైన కారులో …
Read More »వికలాంగుల కోసం ఎంత చేసినా తక్కువే..మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని మలక్ పేట నల్లగొండ చౌరస్తాలోని దివ్యాంగుల సహకార సంస్థ ఆవరణలో వికలాంగుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన వికలాంగుల జాతీయ పార్క్ను డిప్యూటీ సీఎం మహముద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్, పట్నం మహేందర్రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ పార్క్ను జీహెచ్ఎంసీ రూ. 2 కోట్ల నిధులతో కేవలం వికలాంగుల కోసమే ఏర్పాటు చేశారు. వికలాంగుల కోసం దేశంలోనే ప్రథమంగా ఈ పార్క్ …
Read More »