ప్రస్తుత కాళేశ్వరం ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న అప్పటి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు” కాకా” వెంకట స్వామీ చలవేనని రాష్ట్ర ఇరిగేషన్,మార్కెటింగ్, శాసన సభ వ్యవహారాల మంత్రి హరీశ్ రావు అన్నారు. శుక్రవారం నాడు హైదరాబాద్ లో దివంగత జి.వెంకటస్వామి మూడవ వర్ధంతి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.అయితే అప్పడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీళ్ళు లేని చోట ప్రాజెక్టును ప్రతిపాదించిందని ముఖ్యమంత్రి కెసిఆర్ నీళ్ళు లభ్యత ఉన్న మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టుకు రీ …
Read More »రైతులను ఆదుకోండి.. జితేందర్ రెడ్డి
గత అక్టోబర్ నెలలో కురిసిన అకాల వర్షాల వల్ల రాష్ట్రంలో వేల హెక్టార్లలో పత్తి రైతులు నష్టపోయారని, వారిని ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని టిఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత జితేందర్ రెడ్డి కోరారు. దేశ వ్యాప్తంగా ప్రకృతి విపత్తుల కారణంగా జరిగిన నష్టంపై లోక్ సభలో జరిగిన చర్చలో జితేందర్ రెడ్డి మాట్లాడారు.కృష్టా జలాల పంపకంలో కూడా రివర్ మేనేజ్మెంట్ బోర్టు, ట్రిబ్యునల్ విఫలమయ్యాయని సభ దృష్టికి …
Read More »కాంగ్రెస్ నేతలు నిజాలు తెలుసుకుని మాట్లాడాలి..ఎమ్మెల్సీ కర్నె
కాంగ్రెస్ నేతలపై ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు .కాంగ్రెస్ నేతలు నిజాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు.ఇవాళ టిఆర్ఎస్ఎల్పీలో అయన మీడియాతో మాట్లాడుతూ..కాంగ్రెస్ హయాంలో కార్పొరేట్ కళాశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయని.. ప్రైవేట్ విద్యను ప్రోత్సహించడం వల్ల విద్యా వ్యవస్థ నాశనం అయ్యిందన్నారు.కాంగ్రెస్ హాయాంలోని ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను కూడా టిఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చాకా తీర్చిందన్నారు. అదుపు తప్పిన విద్యా వ్యవస్థను ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ గాడిలో పెడుతున్నారని తెలిపారు.అన్ని వర్గాలకు …
Read More »పేదల ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం
పేదల ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఇవాళ నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పోచారం మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను చూసి ఎన్నారైలు ఆశ్చర్చపోతున్నరన్నారు. దేశంలోనే సంక్షేమ రంగంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని తెలిపారు . కేసీఆర్ కిట్ల పంపిణీతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీల సంఖ్య పెరిగినట్లు చెప్పారు.
Read More »సంధ్యారాణి ని అందుకే చంపా..సంచలన విషయాలు వెల్లడించిన కార్తీక్
నిన్న ప్రేమోన్మాది దాడిలో గాయపడిన యువతి సంధ్యారాణి ఇవాళ గాంధీ ఆసుపత్రి లో మృతి చెందిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో పోలీసుల విచారణలో నిందితుడు కార్తీక్ పలు సంచలన విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. సంధ్యారాణితో మూడేళ్ల నుంచి నాకు పరిచయం ఉంది. సంధ్యను ప్రాణంగా ప్రేమించా. కానీ తను నా ప్రేమను ఒప్పుకోలేదు. సంధ్య నాతో మాట్లాడటం బంద్చేసింది. తనకు ఫోన్ చేస్తే కొలీగ్ ఫోన్ మాట్లాడి సంధ్య …
Read More »ఈనెల 24న హైదరాబాద్కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం ఈనెల 24న హైదరాబాద్కు వస్తున్నారు. మధ్యాహ్నం 1 గంటకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్తారు. అదేరోజు రాత్రి రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్ నరసింహన్ రాజ్భవన్లో నిర్వహించే విందుకు హాజరవుతారు. 26న రాష్ట్రపతి నిలయంలో తేనీటి విందును నిర్వహిస్తారు. రాష్ట్రపతి నిలయంలో నాలుగు రోజుల బస అనంతరం ఆయన 27న హైదరాబాద్ నుంచి …
Read More »చంద్రబాబుకు బిగ్ షాక్..టీ కాంగ్రెస్ లోకి టీడీపీ సీనియర్ నేత..!
తెలుగుదేశం పార్టీ అధినేత , ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మరో షాక్ తగలబోతుంది . త్వరలోనే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి చేరనునట్లు తెలుస్తుంది.తెలుగుదేశం పార్టీలో ఉంటే భవిష్యత్తు లేదనే ఉద్దేశంతోనే ఆయన ఆ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కుమారుడి కోసమే దేవేందర్ గౌడ్ దేవేందర్ గౌడ్ చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కారణం ఏమిటనేది …
Read More »బ్రేకింగ్ : గుజరాత్ సీఎం విజయ్ రూపానీ రాజీనామా..!
గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేయడంతో మంత్రులు కూడా రాజీనామా చేసినట్లయింది. గుజరాత్ లో ఇటీవలే ఎన్నికలు జరిగాయి. బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చింది. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి విజయ్ రూపానీ రాజీనామా లేఖను గవర్నర్ కు పంపారు. అయితే నూతన సర్కార్ ఏర్పడేంత వరకూ ఆపధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని రూపానీని గవర్నర్ కోరారు. గుజరాత్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో …
Read More »హైదరాబాద్ బిర్యానీ….ఇంకో ప్రత్యేకతను సంతరించుకుంది
హైదరాబాద్ బిర్యానీ ఖాతాలో మరో ప్రత్యేకత నమోదైంది. శతాబ్ధాలు గడిచినా హైదరాబాదీలకు బిర్యానీ మీద మోజు తీరలేని మరోమారు రుజువైంది. దేశ ప్రథమ పౌరుడు సైతం హైదరాబాద్ అంటే బిర్యానీ అని కొనియాడాడంటే ఈ సంప్రదాయ వంటకానికున్న ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గి విశ్లేషణ అదే విషయాన్ని రుజువు చేస్తోంది. నగరవాసులు అత్యధికంగా బిర్యానీనే ఆర్డర్ చేస్తన్నారని గత ఏడాది ఆర్డర్లను విశ్లేషించి వెల్లడించింది. …
Read More »మంత్రి జగదీష్పై సోషల్ మీడియాలో పోస్టులు..ముగ్గురు అరెస్ట్
రాజకీయ నేతలను సోషల్ మీడియాలో విమర్శిస్తున్న వారిపై ఇటీవల చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డిని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై ముగ్గురు యువకులను సూర్యపేట పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసినట్లు జిల్లా యస్.పి ప్రకాష్ జాదవ్ తెలిపారు. అరెస్టయిన వారిలో సూర్యపేట పట్టణానికి చెందిన నాగేందర్, కళ్యాణ్, సంపత్ …
Read More »