అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ ప్రజాప్రతినిధులతో సమావేశం కొనసాగుతోంది.. ఈ సమావేశానికి శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, పలువురు మంత్రులు, అన్ని పార్టీలకు చెందిన బీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బలహీన వర్గాల కోసం ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కేసీఆర్ వివరించారు. బీసీల అభివృద్ధికి సంబంధించి.. ఆయా వర్గాల నుంచి చాలా డిమాండ్లు, వినతులు వస్తున్నాయని తెలిపారు. …
Read More »2018 ఖరీఫ్ నాటికి అన్ని మార్కెట్లలో ఈ-నామ్ అమలు..మంత్రి హరీష్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని బోయిన్పల్లి మార్కెట్లో ఈ-సేవ శిక్షణ తరగతులను మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ ప్రారంభించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. ఈ-నామ్పై అవగాహన పెంపొందించేందుకు, అమలు చేసేందుకు శిక్షణ తరగతులను ప్రారంభించామన్నారు. ఈ-సేవ శిక్షణ తరగతులు ఆరు రోజుల పాటు కొనసాగుతాయని చెప్పారు.ఈ-నామ్ ద్వారా కొనుగోలు చేయడం వల్ల దళారీ వ్యవస్థ పోతుందని తెలిపారు. 2018 ఖరీఫ్ నాటికి అన్ని మార్కెట్లలో ఈ-నామ్ అమలు జరగాలని …
Read More »తిరుమల శ్రీవారిని దర్శించుకొన్న మిథాలి రాజ్
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలి రాజ్ ఇవాళ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం స్వామి వారికి జరిగే సుప్రబాత సేవలో కుటుంబ సభ్యులతో కలిసి ఆమె స్వామివారి ఆశీస్సులు పొదారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ…రాబోయే సంవత్సరంలో టీ20 ప్రపంచ కప్ కోసం ఎంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. మహిళా క్రికెట్ జట్టుపై స్వామి వారి ఆశీస్సులు ఎప్పుడూ వుండాలని ప్రార్థించానన్నారు. స్వామి …
Read More »శ్రీనివాస్ కూచిభొట్ల హత్యలో కొత్త షాకింగ్ ట్విస్ట్
గత ఫిబ్రవరిలో అమెరికాలోని తెలుగు ఇంజినీర్ హత్య ఉదంతం కొత్త మలుపు తిరిగింది. అమెరికాలో తెలుగు సాఫ్ట్వేర్ ఇంజినీర్ శ్రీనివాస్ కూచిభొట్ల(32) హత్యకేసులో నిందితుడు ఆడం ప్యూరింటన్(52) తాను తప్పు చేశానన్న భావనను వ్యక్తం చేయలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కాన్సాస్ పట్టణంలోని ఒక బార్లో ప్యూరింటన్ అనే మాజీ నేవీ ఉద్యోగి శ్రీనివాస్ను జాతిపరమైన వివక్షతో కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఈ కేసు ప్రాథమిక విచారణ శుక్రవారం …
Read More »టెకీలకు గుడ్న్యూస్.. పాత పద్ధతిలోనే హెచ్1బీ వీసాలు
అమెరికా టెకీలకు తీపికబురు. హెచ్ 1 బీ వీసా జారీ విధానంలో ఎలాంటి మార్పులూ తీసుకొనిరాలేదని, పాత విధానమే అమలవుతుందని అమెరికా స్పష్టంచేసింది. హెచ్ 1 బీ వీసా జారీ విధానంలో మార్పుల కోసం ఉద్దేశించిన బిల్లు ఇంకా చట్టసభలో పాస్ కాలేదని దక్షిణాసియాకు అమెరికా డిప్యూటీ అసిస్టెంట్ స్టేట్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న థామస్వాజ్దా పేర్కొన్నారు. దీంతో టెక్వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోంది.బెంగాల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సమావేశంలో …
Read More »మెగా బ్రదర్ కొత్త వివాదంలో ఇరుక్కున్నారా..?
తెలుగు బుల్లితెర హాట్ కామెడీ ప్రోగ్రాం జబర్దస్త్ షో ప్రస్తుతం వివాదాల మధ్య నడుస్తోంది. జబర్దస్త్లో ఆనాధలు, మహిళలు, హిజ్రాల గురించి తమకి నచ్చినట్టు పంచ్లు వేస్తున్నారని కొన్ని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. వల్గర్ కామెడీకి వేదికగా, వివిధ వర్గాలు, ఆనాధలు, మహిళలు కించపరిచేందుకే వేదికగా జబర్దస్త్ షో మారిందని అటు మానవ హక్కుల కమిషన్ లోను ఇటు సైబరాబాద్ స్టేషన్లోను ఫిర్యాదులు నమోదయ్యాయి. దీనిపై ఇప్పటికే ఓ రేంజ్ …
Read More »ప్రత్యేక హోదా పై లేని ప్రేమ.. పోలవరంపై ఎందుకు బాబూ..!
ఏపీ సీఎం చంద్రబాబు విషయంలో ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో చంద్రబాబు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారనే వ్యాఖ్యలు జోరందుకున్నాయి. తాజాగా చంద్రబాబు కేంద్రంతో తెగతెంపులు చేసుకుంటున్నారనే వార్తలు మీడియాలో జోరందుకున్నాయి. దీంతో తాజాగా విమర్శలు జోరు కూడా అంతే రేంజ్లో ఊపందుకుంది. విషయంలోకి వెళ్తే.. 2014లో బీజేపీ-టీడీపీలు సంయుక్తంగా జట్టుకట్టి ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అంతేకాకుండా బాబు కేంద్రంలో రెండు మంత్రి పదవులు …
Read More »19 నుంచి భద్రాద్రి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు
భద్రాద్రి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల పోస్టర్ ను హైదరాబాద్ లోని సచివాలయంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు ఆవిష్కరించారు. ఈ నెల 19 నుంచి వచ్చే నెల 8 వరకు భద్రాద్రి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని మంత్రులు తెలిపారు. ఈ నెల 28న గోదావరిలో తెప్పోత్సవం, 29 ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చే స్వామి వారిని కనులారా తిలకించేందుకు తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద …
Read More »ఇప్పటివరకు 29644 ఉద్యోగాలు…త్వరలో 4 వేల కొత్త ఉద్యోగాలు
గతంలో మాదిరిగా అటెండర్, డ్రైవర్ పోస్టులకే ప్రాధాన్యం ఇవ్వకుండా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో అగ్రికల్చర్, ఇరిగేషన్, హెల్త్ సెక్టార్లలో ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపడుతున్నదని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం 34 వేల ఉద్యోగాల భర్తీకి జీవోలు జారీ చేసిందని వెల్లడించారు. ఇప్పటి వరకు 29,644 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశామని, 26 వేల ఉద్యోగాలకు పరీక్షలు పూర్తయ్యాయని వివరించారు. …
Read More »సీఎం కేసీఆర్ ఎఫెక్ట్: ఒక్కరోజే 13303 డీడీలు తీసిన డీలర్లు.!!
సమ్మె పేరుతో రాష్ట్రంలో కొంత మంది డిడిలు కట్టకపోవడం వల్ల డిసెంబర్ నెలలో పేదలకు నిత్యవసర సరుకులు అందని పరిస్థితి నెలకొంది. ఈ విషయంపై ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ..పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజెందర్, కమిషనర్ సివి ఆనంద్ లతో సమీక్ష నిర్వహించారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పంపిణీకి విముఖంగా ఉన్న డీలర్లను వెంటనే తొలగించి, కొత్త డీలర్లను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం …
Read More »