ప్రముఖ సినీనటుడు , జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కలిసి ఫొటోలు దిగడానికి అభిమానులు ఎంతగా పోటీ పడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనతో సెల్ఫీ తీసుకుని ఆనందంతో గంతులు వేస్తూ గర్వంగా దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. అయితే, ఈ రోజు పవన్ కల్యాణ్ తమ కార్యకర్తతో స్వయంగా సెల్ఫీ తీసుకుని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. Saamijika, ardhika parivarthana Kosam …
Read More »అవినీతి కేసులో షబ్బీర్ అలీ..!
ఈడీ చార్జిషీట్లో తెలంగాణ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ పేరు నమోదుచేసింది. సీబీఐ మాజీ డైరెక్టర్లు ఏపీ సింగ్, రంజిత్ సిన్హా అవినీతి కేసులో షబ్బీర్ అలీపేరు తెరపైకి వచ్చింది. రంజిత్ సిన్హా కోసం హవాలా డీలర్ మెయిన్ ఖురేషీ లంచాలు వసూలు చేశాడు. కాగా, ఖురేషికి షబ్బీర్ అలీ లంచం ఇచ్చి తన పనులు చేయించుకున్నాడని ఈడీ చార్జిషీట్లో పేర్కొంది. అయితే దీనిపై స్పందించిన.. షబ్బీర్ అలీ, మీడియాతో …
Read More »రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాలు ప్రాజెక్టులను అడ్డుకుంటున్నాయి.. మంత్రి హరీష్
పీఎంకేఎస్వై కమిటీ సమావేశం ముగిసింది. కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సాగునీటి ప్రాజెక్టులపై చర్చించారు. ఈ సందర్బగా హరీశ్ రావు మీడియాతో మాట్లడుతూ… ఏఐబీపీ కింద తెలంగాణలోని 11 ప్రాజెక్టులకు రావాల్సిన రూ. 500 కోట్లను త్వరగా విడుదల చేయాలని కోరినమని మంత్రి వెల్లడించారు. ఈ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని సీడబ్ల్యూసీ అధికారులకు కేంద్రమంత్రి …
Read More »మాకు రక్షణ కల్పించండి..!
మాకు ప్రాణహాని ఉందంటూ హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీని ఆశ్రయించింది ఒక దళిత ప్రేమజంట. అమ్మాయి తండ్రి అయిన బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రసాద్ తమను విడగొట్టాలని చూస్తున్నాడని ఫిర్యాదులోతెలిపారు . తన తండ్రి తమలాంటి ఎన్నో ప్రేమజంటలను విడగొట్టాడని స్నేహ తెలిపింది. పోలీసులు తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేసింది. ఇద్దరం ఒకే కులానికి చెందినవాళ్లం కావడంతో ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకుందామని ప్రయత్నించినా …
Read More »ఉప రాష్ట్రపతితో మంత్రి హరీశ్ రావు భేటి
తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ అండ్ మార్కెటింగ్ శాఖల మంత్రి హరీశ్ రావు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుని కలిశారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన మంత్రి హరీశ్.. మర్యాద పూర్వకంగా ఉప రాష్ట్రపతిని కలిశారు.అంతకుముందు మంత్రి హరీశ్ రావు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖల మంత్రి హర్షవర్ధన్ తో సమావేశం అయ్యారు. నీటి పారుదల రంగం, ప్రాజెక్టులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.మంత్రి హరీశ్ రావు వెంట ఎంపీలు బూర నర్సయ్య గౌడ్, బీబీ …
Read More »కరీంనగర్, ఖమ్మంలకు అభివృద్ధి అథారిటీల ఏర్పాటు..
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్, ఖమ్మం నగర సమగ్రాభివృద్ధికి అర్భన్ డెవలప్మెంట్ అథారిటీలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులనుముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు ప్రగతి భవన్లో కరీంనగర్ జిల్లా మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్, శోభలకు అందజేశారు. ఖమ్మం నగర సమగ్రాభివృద్ధికి స్థంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖమ్మం పట్టణంతో …
Read More »రేవంత్ రెడ్డికి మరో భారీ షాక్..!
తెలంగాణ టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అయిన అనుముల రేవంత్ రెడ్డికి మరో భారీ షాక్ తగిలింది . కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్, దౌల్తాబాద్ మండలాల టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి 700 మంది కార్యకర్తలు ఈ రోజు తెలంగాణ భవన్లో అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి మహేందర్రెడ్డి చేతుల మీదుగా వీరంతా గులాబీ కండువాలు …
Read More »బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ క్షేమం..!
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్కు తృటిలో ప్రమాదం తప్పింది. బీబీనగర్లో బీజేపీ పార్టీ నిర్వహించిన ప్రజా పంచాయతీ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. అ సమయంలో బీబీనగర్ ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలుల కారణంగా బీజేపీ కార్యక్రమం కోసం ఏర్పాటుచేసిన టెంట్ ఒక్కసారిగా కూలింది. ఆ సమయంలో లక్ష్మణ్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఊహించని పరిణామంతో భయాందోళనకు గురైన …
Read More »నీటిని పొలాలకు మళ్ళించి.. పొదుపుగా వాడుకోవాలి.. సీఎం కేసీఆర్
నీటి పారుదల రంగానికి కావాల్సినన్ని నిధులు సమకూర్చడంతో పాటు తెలంగాణకున్న నీటి వాటా మొత్తం వాడుకునేలా భారీ ప్రాజెక్టులు నిర్మిస్తున్నందున ఎంత వీలైతే అంత వరకు పంటలకు సాగునీరు అందించే వ్యవస్థను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఎక్కడా వివాదాలకు తావు లేకుండా ప్రజాప్రతినిధులు సమన్వయంతో వ్యవహరించి.. నీటిని పొలాలకు మళ్లించాలని, నీటిని చాలా పొదుపుగా వాడుకోవాలని సీఎం సూచించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ)లోని నీటి విడుదల, వినియోగానికి సంబంధించి …
Read More »జగన్ పాదయాత్ర రూట్ మ్యాప్ ఇదే..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్కు సీబీఐ కోర్టు నుండి వ్యక్తిగత హాజరు నుండి మినహాయిపు లభించక పోయినా.. తాను నిర్ణయించుకున్న పాదయాత్రను నిర్వహించేందుకు కార్యచరణను సిద్ధం చేసుకున్నారు. ఇక ముందుగా అనుకున్న నవంబరు 2 నుంచి కాకుండా 6వ తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారని సమాచారం. ఇక మొత్తం 13 జిల్లాల్లోని సుమారు 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని ప్రతిపక్ష నేత జగన్ డిసైడ్ అయ్యారు. …
Read More »