టీటీడీ ఛైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి పలు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల విఐపీలకు బ్రేక్ దర్శనాలు కల్పించే ఎల్1, ఎల్2, ఎల్3 లను రద్దు చేశారు. దేవుడి ముందు అందరూ సమానమే అని ప్రకటించారు. తాజాగా తిరుమలలో 60 సంవత్సరాలు దాటిన వయో వృద్ధులకు 30 నిమిషాల్లో ఉచిత దర్శనం చేయించనున్నట్లు వైవీ సుబ్బారెడ్డి …
Read More »ఏపీ లోకాయుక్తగా జస్టిస్ పి. లక్ష్మణ్ రెడ్డి ప్రమాణ స్వీకారం..హాజరైన సీఎం జగన్..!
ఏపీలో వైయస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అవినీతి నిరోధానికి సీఎం జగన్ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా లోకాయుక్త పదవికి జస్టిస్ పి. లక్ష్మణ్ రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇవాళ ఏపీ లోకాయుక్తగా జస్టిస్ పి.లక్ష్మణ్రెడ్డి పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఇవాళ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉదయం 11 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆయనచే ప్రమాణ స్వీకారం చేశారు. ఐదేళ్ల పాటు …
Read More »పీవోకేలో పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు ఘోర అవమానం..!
కశ్మీర్లో వివాదాస్పద ఆర్టికల్ 370 ని మోదీ సర్కార్ రద్దు చేయడంతో పాకిస్తాన్ షాక్కు గురైంది. కశ్మీర్ అంశంపై ప్రపంచ దేశాల్లో భారత్ను దోషిగా నిలబెట్టాలన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ కుయుక్తులు ఫలించలేదు. ఐక్యరాజ్యసమితితో సహా ప్రపంచదేశాలన్నీ కశ్మీర్ భారత్ అంతర్భాగం అని..తేల్చి చెప్పాయి. దీంతో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ భారత్పై యుద్ధం చేస్తామని, అణుబాంబులతో దాడులు చేస్తామని బీరాలు పలుకుతున్నాడు. కశ్మీర్ తర్వాత భారత్ తదుపరి లక్ష్యం పాక్ …
Read More »నల్లమల అడవుల్లో యురేనియం మైనింగ్కు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు..మంత్రి కేటీఆర్ ప్రకటన…!
నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని విపక్షాలు రాద్ధాంతం చేస్తున్న దరమిలా ఇవాళ అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఈ రోజు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… నల్లమల అడవుల్లో యురేనియం మైనింగ్కు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు..ఇక నుంచి ఇవ్వబోము అని స్పష్టమైన ప్రకటన ఇచ్చారు. యురేనియం నిక్షేపాల కోసం నాగర్కర్నూల్- ఆమ్రాబాద్ ప్రాంతంలో ఎలాంటి అన్వేషణ చేపట్టలేదని, యురేనియం తవ్వకాలకు …
Read More »బుుషికేష్లో ముగిసిన విశాఖ శారదాపీఠాధిపతుల చాతుర్మాస్య దీక్ష ..!
బుుషికేష్, పవిత్ర గంగానదీ తీరాన రెండు నెలల పాటు సాగిన విశాఖ శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారి చాతుర్మాస్యదీక్ష నేడు ముగిసింది. లోక కల్యాణం కోసం పదేళ్లుగా ఋషీకేశ్ లో చాతుర్మాస్య దీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ సారి కూడా జూలై 16న బుుషికేష్, శారదాపీఠం ఆశ్రమంలో శ్రీ స్వరూపనందేంద్ర సరస్వతీ మహాస్వామి వారు దీక్ష ప్రారంభించారు, ఇటీవల విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారిగా నియమితులైన శ్రీ స్వాత్మానందేంద్ర …
Read More »ఎడిటోరియల్ : పచ్చని అడవుల్లో భయంకర విధ్వంసం..!
ఆకాశాన్ని తాకే తూర్పు కనుమలకు, ప్రకృతి రమణీయ దృశ్యాలకు, అరుదైన వృక్షజాతులకు, కనువిందు చేసే వణ్యప్రాణులకు నెలవు…తెలుగు రాష్ట్రాల అమెజాన్గా పేరుగాంచిన నల్లమల అడవులు..అంతరించిపోనున్నాయా… మానవ మనుగడ ప్రశ్నార్థకం కానుందా..జీవ వైవిధ్యం దెబ్బతిని జీవ జాతులు అంతరించిపోతున్నాయా..మన నాగరికతకు మూలవాసులైన చెంచుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందా..భవిష్యత్తులో భయంకరమైన ప్రకృతి విధ్వంసం చోటు చేసుకోబోతుందా…ప్రస్తుతం నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాల గురించి వస్తున్న వార్తలు తెలుగు ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. యురేనియం …
Read More »తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు…భట్టి విక్రమార్కకు సీఎం కేసీఆర్ కౌంటర్..!
తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో ప్రాజెక్టులపై ప్రతిపక్షనేత భట్టి విక్రమార్కకు, సీఎం కేసీఆర్కు మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. తెలంగాణ ప్రాజెక్టులపై చర్చ జరిగి సందర్భంగా ఇందిరాసాగర్, రాజీవ్సాగర్, దుమ్ముగూడెం ప్రాజెక్టులపై మాట్లాడిన భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో తప్పు పట్టారు. దేవాదుల, దుమ్ముగూడెంకు గత ప్రభుత్వాలు ఖర్చుచేశాయని , ప్రభుత్వం ప్రాజెక్టుల విషయంలో ప్రణాళికతో ముందుకెళ్తే ఇప్పటికే 35 లక్షల ఎకరాలు పారేవంటూ తీవ్ర విమర్శలు చేశారు. దీంతో …
Read More »పొలిటికల్ అజ్ఞాతవాసి…ఈ నెల్లూరు టీడీపీ నేత…!
అనగనగా ఓ రోజు సినిమా గుర్తుందా..ఆ సిన్మాలో బ్రహ్మానందం..నెల్లూరు పెద్దారెడ్డిగా తెగ బిల్డప్ ఇస్తాడు. అయితే పోలీసులు అమాంతం ఎత్తి లోపలేస్తారు. అలాగే రాజకీయాల్లో కూడా నిన్నటిదాకా తెగ బిల్డప్ ఇచ్చిన ఈ నెల్లూరు సోమిరెడ్డి జైల్లోకి పోతాననే భయంతో పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడు. ప్రత్యక్ష ఎన్నికల్లో వరుసగా 5 సార్లు ఓడిపోయినా…నెల్లూరు పెద్దారెడ్డిగా బిల్డప్ ఇచ్చుకునే టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చంద్రబాబు ప్రస్తుతం …
Read More »ఎడిటోరియల్…చనిపోయిన పార్టీని బతికించుకోవడానికేనా ఈ డ్రామాలు…!
ఏపీలో ఇటీవలి ఘోర పరాజయం తర్వాత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇకనుంచైనా ప్రతిపక్ష నాయకుడి హోదాలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని, నవ్యాంధ్ర ప్రగతిలో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తారని అంతా ఆశపడ్డారు. కానీ 3 నెలల్లోనే చంద్రబాబు ఆ ఆశలను అడియాసలు చేశారు. 40 ఏళ్ల అనుభవం కలిగిన నాయకుడిగా, యువ ముఖ్యమంత్రికి సలహాలు ఇస్తూ..రాష్ట్ర అభివృద్ధికి సహకరించాల్సిన పోయి..ఇలా రోజుకో డ్రామాలు ఆడుతూ, ప్రభుత్వంపై పదే పదే దుష్ప్రచారాలకు …
Read More »చంద్రబాబును కించపరిచేలా పోస్టులంటూ లోకేష్ ఆక్రోశం..!
తెలుగు రాజకీయాల్లో తప్పులు తాము చేసి పైకి మాత్రం పెద్ద మనుషుల్లా బిల్డప్ ఇచ్చే నేతల్లో చంద్రబాబు, లోకేష్ల తర్వాతే ఎవరైనా. తప్పులు తాము చేస్తూ..ఎదుటోళ్లు ఆ తప్పులు చేస్తున్నారంటూ..గగ్గోలు పెట్టి…ప్రజలను మభ్యపెట్టడం ఈ తండ్రి కొడుకులకే తెలిసిన విద్య. సోషల్ మీడియాలో పెయిడ్ ఆర్టిస్టులతో పోస్టులు పెట్టించి…అదిగో వైసీపీ ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం అంటూ దుష్ప్రచారం చేయించి..అడ్డంగా దొరికిన పోయిన ఘనత..బాబు, లోకేష్లదే. గత ఐదేళ్లలో నాటి ప్రతిపక్ష …
Read More »