తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఆశలకు, ఆనందాలకు ప్రతీకగా జరుపుకొనే ఉగాది తెలుగువారికి పవిత్రమైన పండుగగా అభివర్ణించారు. ఈ ఉగాది కొవిడ్ వైరస్ నుంచి మానవజాతికి రక్షణ కల్పించి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని గవర్నర్ ఆశాభావం వ్యక్తంచేశారు. కొవిడ్ రెండోదశను ప్రజలంతా ధైర్యంగా ఎదుర్కోవాలని, అప్రమత్తంగా వ్యవహరించి ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని కోరారు. శాసనమండలి చైర్మన్ గుత్తా …
Read More »చారిత్రాత్మకంగా యాదాద్రి
యాదాద్రి నిర్మాణం చారిత్రాత్మకంగా జరుగుతున్నదని, ఈ నిర్మాణం చేపట్టిన సీఎం కెసిఆర్, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా పరిపాలన సాగిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శాసన సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ కరోనా కష్ట కాలంలోనూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధికి అద్దంపట్టేలా ఉందని అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సీఎం కెసిఆర్, ఆయన కుటుంబం చిరాయువుగా …
Read More »శివరాత్రికి ఏం చేయాలి? ఎలా జరుపుకోవాలి ?
సనాతన సంస్కృతిలో పండుగలంటే కేవలం విశ్రాంతి కోసమో, ఆహ్లాదం కోసమో ఉద్ద్యేశించబడినవి కావు. ప్రత సంబరంలోనూ ఆధ్యాత్మికత, దైవికత ఉంటుంది. ప్రతి పండుగకు వైజ్ఞానిక, ఆరోగ్య, శాస్త్రీయ కారణాలుంటాయి. అంతరిక్షం నుంచి ప్రసరించే కాస్మిక్ కిరణాలను, విద్యుత్ అయస్కాంత్ తరంగాలను దృష్టిలో ఉంచుకుని, ఏ రోజున ఏ పని చేయడం వలన మనిషి జీవనం వికసిస్తుందో, ఇంతకముందు ఉన్న స్థితి నుంచి మరింత గొప్ప స్థితికి ఎదిగే అవకాశం లభిస్తుందో, …
Read More »శివరాత్రి రోజు జాగరణ ఎందుకు…?
హిందువులు, ముఖ్యంగా శివ భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండగ మహా శివరాత్రి. ఆ మహా శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు కూడా మహా శివరాత్రి అని పురాణాలు చెబుతున్నాయి. మహా శివరాత్రికి ఎన్నో ప్రాధాన్యతలు, ప్రత్యేకతలు ఉన్నాయని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. పురాణాల ప్రకారం.. శివుడు తాను గరళం మింగి మానవాళిని కాపాడిన రోజు మహా శివరాత్రి అని చెబుతుంటారు. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి, రాత్రి మొత్తం …
Read More »“శివోహం” అంటే అర్ధం ఏమిటో తెలుసా..?
మనం మానవులం.. ఎన్నో కర్మలు చేస్తాం. ఇలాంటి మనం శివుడు ఎలా అవుతాం? శివోహం అని ఎందుకు అంటున్నాం? మనం శివుడిగా మారాలి అంటే మనం తెలుసు కోవలసినది ఏమిటి? మన గ్రూప్ లో ఉన్న సభ్యులు అందరికి తప్పక తెలియాల్సిన విషయం ఇది. ఆది శంకరాచార్యుల వారి సాహిత్యమును స్తోత్ర (భక్తి) సాహిత్యము, వైరాగ్య ప్రకరణములు అని రెండుగా విభజించవచ్చు… ఆది శంకరాచార్య విరచిత నిర్వాణషట్కం వైరాగ్య ప్రకరణముల …
Read More »శివడు లింగాకారంపై మూడు తిలకాల యొక్క రహస్యం -మీకోసం..?
శివడు లింగాకారం పైన మూడు తిలకాలను దిద్దుతారు వాటి యొక్క రహస్యము. 1. మొదటిది బ్రహ్మ కి గుర్తు 2. రెండవది విష్ణువు కి గుర్తు 3. మూడవది శంకరుడు కి గుర్తు మద్యలో గంధాన్ని బిందువుగా పెడతారు, అది పరమాత్మని యొక్క స్మృతి చిహ్నమునకు గుర్తు అదే పరమాత్మని యొక్క యథార్థ స్వరూపం. 1. పరమాత్ముని నామం సదా శివ, 2. సదా శివ అంటే సదా – …
Read More »యాదాద్రిలో ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్
పంచనారసింహ క్షేత్రం యాదగిరిగుట్టలో ఆలయ అభివృద్ధి పనులను సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నారు. అంతకు ముందు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా యాదగిరిగుట్టపైకి చేరుకున్నారు. నేరుగా బాలాలయానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారు. అంతకు ముందు ఆయనకు అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్థపతి వేలు, ఆనంద్ సాయి, యాడా అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఈ …
Read More »రామ మందిరానికి విరాళాలు ఎన్నో వచ్చాయో తెలుసా..?
అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం విరాళల సేకరణ కార్యక్రమం శనివారంతో ముగిసింది. 44 రోజులపాటు సాగిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విరాళాలు సేకరించారు. మొత్తంగా రూ.2 వేల కోట్ల వరకూ విరాళాలు వచ్చినట్లు ట్రస్ట్ అధికారులు వెల్లడించారు. అయితే ఇందులో ఇంకా చాలా వరకు డబ్బును ఇంకా బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సి ఉన్నట్లు వాళ్లు తెలిపారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయితే.. విరాళాల మొత్తం మరింత …
Read More »అద్భుతంగా యాదాద్రి
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు అత్యంత మహాద్భుతంగా, సువిశాలమైన స్థలంలో శరవేగంగా సాగుతున్నాయి. ఆలయ నగరిలో ఒక్కో కట్టడానికి ఒక్కో కొలతలు వేసి అందంగా, భక్తులకు అనువుగా తీర్చిదిద్దుతున్నారు. యాదాద్రి కొండపై శిల్ప కళాసౌరభంగా రూపుదిద్దుకుంటున్న పంచనారసింహ క్షేత్రం నిర్మాణాలను 17.32 ఎకరాల్లో చేపడుతున్నారు. ఇందులో 4.30 ఎకరాల్లో ప్రధానాలయం, బ్రహ్మోత్సవ మండపం, మాఢవీధులు, ప్రాకారాలు, సప్తతల, పంచతల రాజగోపురాలు, వేంచేపు మండపం, రథశాల, లిప్టు నిర్మించగా, పనులు …
Read More »తిరుమలలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు బుధవారం దర్శించుకున్నారు. ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. తన మొక్కులను చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలు, పట్టువస్త్రాలను పొంగులేటి గారి దంపతులకు అందజేశారు. స్వామివారి దర్శనం …
Read More »