ప్రభుత్వ రంగ టెలికం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ ఓ సరికొత్త ఆఫర్ ప్రకటించింది.ఇందులో భాగంగా కస్టమర్ రూ.797తో రీచార్జ్ చేసుకుంటే 395రోజుల వ్యాలిడిటీని వినియోగదారులకు అందిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే ఈ ప్లాన్ లో భాగంగా రోజుకు 2GB హైస్పీడ్ డేటా, 100SMSలు 60 రోజుల పాటు లభిస్తాయి. ఆ తర్వాత ఇచ్చే డేటా ఫెయిర్ యూస్ పాలసీ (FUP) ఆధారంగా ఉంటుందని వెల్లడించింది. …
Read More »అంబానీ,అదానీల గురించి షాకింగ్ న్యూస్
ముఖేష్ అంబానీ ,గౌతమ్ అదానీ ఈ రెండు పేర్లు తెలియని భారతీయుడు ఎవరుండరంటే అతిశయోక్తి కాదేమో. అంతగా వీరిద్దరి హావా ప్రస్తుతం దేశంలో నడుస్తుంది. ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లాభాల్లో ఉన్న పలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసి వీరిద్దరికే అప్పజెబుతుంది అని ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగానే వీరిద్దరి సంపద విలువ రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. ప్రపంచమంతా.. ఆర్థిక వ్యవస్థ …
Read More »Debit Card లేని వారికి కేంద్ర సర్కారు శుభవార్త
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో దేశంలో యూపీఐ ద్వారా నగదు చెల్లింపులు చేసేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.దీన్ని అందరికి అందుబాటులోకి తెచ్చే దిశగా నేషనల్ పేమంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా డెబిట్ కార్డు లేనివారికి కూడా యూపీఐ పిన్ సెట్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఆధార్ నంబర్,ఓటీపీ ద్వారా పిన్ సెట్ చేసుకునే వెసులుబాటు వినియోగదారులకు కల్పించాలని బ్యాంకులకు సూచించింది. దీనికి సంబంధించి గత …
Read More »త్వరలో మార్కెట్లోకి ఐఫోన్ కొత్త మోడల్.. కాస్ట్ ఎంతో తెలుసా?
కాలిఫోర్నియా: ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ యాపిల్.. తమ కొత్త మొబైల్ను లాంచ్ చేసింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన యాపిల్ ఈవెంట్లో కొత్త మోడల్ ఐఫోన్ ఎస్ఈ 5జీని రిలీజ్ చేసింది. ఈ ఫోన్ 5జీ టెక్నాలజీతో వర్క్ చేయనుంది. ఈనెల 18 నుంచి అమెరికా మార్కెట్లో ఈ మొబైల్ అందుబాటులో ఉండనుంది. 5జీ టెక్నాలజీతో ఇది పనిచేయనుంది. ఈ ఐఫోన్ ఫీచర్స్ కూడా ఇంట్రెస్టింగ్ ఉండనున్నాయి. అమెరికాలో …
Read More »మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఇంట్లో విషాదం
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన కుమారుడు జైన్(26) మృతి చెందాడు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య, ఆయన భార్య అను దంపతుల కుమారుడు జైన్ నాదెళ్ల సోమవారం ఉదయం(అమెరికా కాలమానం ప్రకారం) మరణించినట్లు మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ తెలిపింది. ఈ విషయాన్ని సత్య నాదెళ్ల తన ఎగ్జిక్యూటివ్ సిబ్బందికి ఇమెయిల్ ద్వారా తెలియజేశారు. జైన్ పుట్టినప్పటి నుంచి సెరెబ్రల్ పాల్సీ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఇక సెరెబ్రల్ …
Read More »అమూల్ పాల రేట్లు పెరిగాయి
అమూల్ పాల రేట్లు పెరిగాయి. నేటి నుంచి లీటరు పాలపై రూ.2 ధర పెంచుతున్నట్లు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ప్రకటించింది. అమూల్ గోల్డ్ 500 మి.లీ రూ.30, అమూల్ తాజా 500 మి.లీ. రూ.24, అమూల్ శక్తి 500 మి.లీ. ప్యాకెట్ ధర రూ. 27 అయ్యాయని పేర్కొంది. పశుగ్రాసం, పాల ప్యాకేజీ, రవాణా రేట్లు పెరగడంతో ధరలు పెంచాల్సి వచ్చిందని తెలిపింది.
Read More »సిలిండర్ల ధరలు మళ్లీ పెరిగాయి
శవ్యాప్తంగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెరిగాయి. 19 కేజీల సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 105, కోల్కతాలో రూ. 108 మేర పెరిగింది. అలాగే 5 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.27 ఎగబాకింది. పెరిగిన రేట్లు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. డొమెస్టిక్ (గృహావసరాల) సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.
Read More »ఆకాశాన్నంటిన బంగారం ధరలు
భారతీయుల్లో బంగారం అంటే ఎంతో ప్రీతి. పుత్తడి కొనుక్కోవాలని.. ఆభరణాలు చేయించుకోవాలని మహిళలు ఆరాటం చూపుతారు. అలాగని బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాదు.. పెట్టుబడికి మార్గం కూడా.. ధర తగ్గినప్పుడు బంగారంపై పెట్టుబడి పెట్టడం శుభ తరుణం అని బులియన్ మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. గతేడాది రూ.43 వేల వద్ద ఉన్న తులం బంగారం ఇప్పుడు రూ.50వేలకు చేరుకుంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య కమ్ముకున్న యుద్ధ మేఘాలు వీడిపోయినా పుత్తడి …
Read More »గౌతమ్ అదానీ ఖాతాలో మరో మైలురాయి
ఇప్పటికే ఇండియాలో అత్యంత సంపన్నుడిగా నిలిచిన గౌతమ్ అదానీ మరో మైలురాయి అందుకున్నారు. 90.1 బిలియన్ డాలర్లతో అదానీ.. ముకేశ్ అంబానీని అధిగమించి ఆసియాలోనే కుబేరుడిగా నిలిచారని ఫోర్బ్స్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా పదో స్థానంలో ఉన్నారు. 2008లో ఈయన సంపద 9.3 బిలియన్ డాలర్లుగా ఉండేది. పోర్టులు, పవర్ జనరేషన్, సోలార్ పవర్, వంటనూనెలు, రియల్ ఎస్టేట్, బొగ్గు ఇలా ఎన్నో రకాల వ్యాపారాలు చేస్తోంది అదానీ గ్రూప్.
Read More »ముఖేశ్ అంబానీ కొత్త కారు ధర ఎంతో తెలుసా..?
భారతదేశంలోనే రెండవ అత్యంత సంపన్నుడు ముఖేశ్ అంబానీ తాజాగా రూ.13.14కోట్ల విలువైన అల్ట్రా లగ్జరీ కారును కొనుగోలు చేశారు. ఈ హ్యాచ్ బ్యాక్ కారు బ్రిటీష్ విలాసవంతమైన వాహనాల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ కు చెందింది. ఈ కారును సౌత్ ముంబయిలోని టార్డియో ఆర్టీఓలో రూ. 20లక్షలు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ పెట్రోల్ కారు దేశంలో ఇప్పటివరకు కొనుగోలు చేయబడిన అత్యంత ఖరీదైన కార్లలో ఒకటి.
Read More »