• యుద్ధ ప్రతిపాదికన 11 క్రయోజనిక్ ట్యాంకుల దిగుమతి • దేశంలో తొలిసారిగా అధికసంఖ్యలో దిగుమతి • తొలి విడతగా ఆర్మీ విమానంలో 3 ట్యాంకుల రాక • ఒక్కొక్క ట్యాంకు నుంచి కోటి 40 లక్షల లీటర్ల లభ్యత • ప్రస్తుత, భవిష్యత్తు ఆక్సిజన్ కొరత నివారణే లక్ష్యం దేశంలో తొలిసారిగా భారీ సంఖ్యలో క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను ప్రభుత్వ అవసరాలకోసం ఉచితంగా అందేంచేందుకు మేఘా ఇంజనీరింగ్ ఇన్ …
Read More »వాహనదారులకు భారీ షాక్
బ్రేక్ లేకుండా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు షాక్ ఇస్తున్నాయి. తాజాగా ఆయిల్ కంపెనీలు పెట్రోల్ లీటర్కు 26 పైసలు, డీజిల్ లీటర్కు 34 పైసలు పెంచాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.95.13కు చేరగా డీజిల్ ధర రూ.89.47గా ఉంది. వ్యాట్ ఎక్కువగా ఉన్న కొన్ని రాష్ట్రాల్లో ధరలు రూ.100 దాటాయి. కొవిడ్ సంక్షోభంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు పెరుగుతున్న పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.
Read More »ఆక్సిజన్ సిలిండర్లను అందించడానికి మేఘా ముందుకు
కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో ఆసుపత్రుల్లో రోగులకు ఆక్సిజన్ అత్యవసరంగా మారింది. దాంతో సహజంగానే ఆక్సిజన్ సిలిండర్లకు డిమాండ్ పెరిగిపోయింది. ఉత్పత్తి సరైన స్థాయిలో లేకపోవడంతో ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా అవసరమైన మేరకు జరగడం లేదు. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్లోని ప్రఖ్యాత నిమ్స్, అపోలో, సరోజినిదేవి వంటి ఆస్పత్రుల నుంచి మేఘా ఇంజినీరింగ్ సంస్థకు ఆక్సిజన్ అందించమని అభ్యర్థనలు వచ్చాయి.. వచ్చిందే తడవుగా మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఆక్సిజన్ సిలిండర్లను …
Read More »ఏపీలో మామిడి పండ్లకు బలే గిరాకీ
కరోనా కష్టకాలంలోనూ..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మామిడి ఎగుమతులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో 3,76,495 హెక్టార్లలో మామిడి సాగవుతుండగా.. ఈ ఏడాది 56.47 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని అంచనా. బంగినపల్లి, సువర్ణ రేఖ, తోతాపురి, చిన్న రసాలకు దేశీయంగానే కాకుండా విదేశాల నుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి. సువర్ణ రేఖ మామిడిని దక్షిణ కొరియాకు తొలిసారి ఎగుమతి చేశారు. విదేశాలకు, వివిధ రాష్ట్రాలకు మామిడి రవాణా అవుతోంది
Read More »SBI కస్టమర్లకు హెచ్చరికలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేసింది. సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోవద్దని హెచ్చరించింది. డేట్ ఆఫ్ బర్త్, డెబిట్ కార్డు నెంబర్, PIN, CVV, OTP, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ID/పాస్వర్డ్ షేర్ చేసుకోవద్దు. SBI, RBI, KYC అథారిటీ నుంచి కాల్ చేస్తున్నామంటే నమ్మొద్దు. మెయిల్స్, కాల్స్ వచ్చే లింకులతో యాప్లు డౌన్లోడ్ చేసుకోవద్దు. సోషల్ మీడియాలో వచ్చే ఆఫర్లను …
Read More »వరుసగా మూడో రోజు పెట్రోల్ మంట
దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత వరుసగా మూడో రోజు కూడా పెట్రో ధరలు పెరిగాయి. ఢిల్లీలో గురువారం లీటర్ పెట్రోలుపై 25 పైసలు, డీజిల్పై 30 పైసలను చమురు సంస్థలు పెంచాయి. ఇక హైదరాబాద్లో లీటరు పెట్రోలుపై 23 పైసలు పెరగగా.. రూ.94.57కు చేరింది. డీజిల్ ధర లీటరుకు 31 పైసలు పెరగగా.. రూ. 88.77కు ఎగబాకింది.
Read More »KYC అప్డేట్ పై ఆర్బీఐ కీలక ప్రకటన
అన్ని ప్రభుత్వ ప్రయివేట్ బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వినియోగదారులు KYC అప్డేట్ తప్పనిసరిగా చేయాలని గతంలో RBI సూచించింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో 2021 డిసెంబర్ 31 వరకు కేవైసీ అప్డేట్ చేయడంలో విఫలమైన వినియోగదారులపై ఎలాంటి ఆంక్షలు విధించవద్దని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలను RBI తాజాగా కోరింది. దీంతో డిసెంబర్ 31 వరకు KYC అప్ డేట్ చేసుకోకపోయినా.. కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
Read More »మరో 600 ఎకరాలను కొనుగోలు చేసిన మార్క్ జుకర్ బర్గ్
ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ దంపతులు హవాయిలో మరో 600 ఎకరాలను కొనుగోలు చేశారు. హవాయిలోని కవాయి ద్వీపంలో ఈ భూమిని 53 మిలియన్ డాలర్లకు (రూ.391 కోట్లు) కొన్నారు. హవాయిలో జుకర్ బర్గ్కు ఇప్పటికే భూమి ఉండగా, ప్రస్తుత కొనుగోలుతో అక్కడ ఆయన భూమి మొత్తంగా 1300 ఎకరాలకు చేరింది.
Read More »కరోనా ఎఫెక్ట్ – మారుతీ సుజుకీ సంచలన నిర్ణయం
దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ కొరత నేపథ్యంలో కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ కీలక నిర్ణయం తీసుకుంది. హర్యానాలోని తమ ఫ్యాక్టరీలన్నింటినీ మూసివేయాలని.. తద్వారా ఆక్సిజన్ నిల్వల్ని వైద్య అవసరాల కోసం మళ్లించనున్నట్లు తెలిపింది. మే 1 నుంచి 9 వరకు హర్యానాలోని ఫ్యాక్టరీలను మూసి ఉంచనుండగా.. ప్రజల ప్రాణాల్ని రక్షించడంలో ప్రభుత్వానికి తమ సహకారం నిరంతరం కొనసాగుతుందని మారుతీ హామీ ఇచ్చింది.
Read More »దేశంలోని ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకులకు 9 రోజులపాటు సెలవులు
దేశంలోని ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకులకు ఏప్రిల్ నెలలో 9 రోజులపాటు సెలవులను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. రిజర్వు బ్యాంకు ఈ వారంలోనే వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ప్రకటించింది.మంగళవారం ఏప్రిల్ 13 నుంచి 16వతేదీ వరకు నాలుగురోజుల పాటు వివిధ పండుగల సందర్భంగా బ్యాంకులకు సెలవులు ఇస్తున్నట్లు రిజర్వు బ్యాంక్ వెల్లడించింది. దేశంలోని వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల వారీగా బ్యాంకులకు 4రోజులపాటు వరుస సెలవులు …
Read More »