దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నప్పటికీ.. స్థిరంగా కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో 1,51,186 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 134 మందికి వైరస్ పాజిటివ్గా తేలినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,78,956కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,582 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 24 …
Read More »ఒడిశాలో మరో రష్యా వ్యక్తి మృతి
ఒడిశాలో మరో రష్యా వ్యక్తి శవమై తేలాడు. గత 15 రోజుల్లో ఆ దేశానికి చెందిన మూడో వ్యక్తి ఒడిశాలో మరణించాడు. అతన్ని మిల్యకోవ్ సెర్గీగా గుర్తించారు. జగత్సింగ్పుర్ జిల్లాలోని పారాదీప్ పోర్టు వద్ద ఉన్న ఓ షిప్లో అతన్ని మృతదేహాన్ని పసికట్టారు. బంగ్లాదేశ్లోని చిట్టాగాంగ్ నుంచి పారాదీప్ మీదుగా ఆ నౌక ముంబై వెళ్తోంది. ఆ షిప్లో సెర్గీ చీఫ్ ఇంజినీర్గా ఉన్నారు.ఇవాళ ఉదయం 4.30 నిమిషాలకు షిప్లోని …
Read More »దేశంలో కొత్తగా 176 మందికి కరోనా
దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. తాజాగా గత 24 గంటల్లో 92,955 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 176 మందికి కరోనా పాజిటివ్గా తేలినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 44,678,822కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,670 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మహమ్మారి కారణంగా ఒకరు మృతి చెందడంతో.. మొత్తం మరణాల సంఖ్య 5,30,707కి చేరింది.
Read More »ప్రధానమంత్రి మోదీ ఇంట విషాదం
ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రధానమంత్రి మోదీ తల్లి గారైన హీరాబెన్ ఇటీవలే వందో పుట్టినరోజు పూర్తిచేసుకున్నరు. అయితే ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో గుజరాత్ లోని అహ్మదాబాద్లోని యూఎన్ మెహతా దవాఖానలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆమె ఆరోగ్యం విషమించడంతో ఇవాళ ఉదయం మూడున్నర గంటలకు తుదిశ్వాస విడిచారు.దీంతో మోదీ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
Read More »అదానీ సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ భారతదేశ వ్యాపార దిగ్గజం అయిన గౌతమ్ అదానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ అదానీ గ్రూప్ వ్యాపార సంస్థ ఇప్పటిది కాదు.. దాదాపు ముప్పై ఏండ్ల కిందట ప్రారంభమైంది.. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నసమయంలోనే ఈ సంస్థను ప్రారంభించాను.. ఆ తర్వాత ఎంతో మంది ప్రధానమంత్రులు వచ్చారు. మరెంతో మంది రాజకీయ నేతలు అధికారంలోకి వచ్చారు. నా సంస్థ యొక్క అభివృద్ధి ఏ ఒక్క నాయకుడి వల్ల …
Read More »పని మనిషిని ముద్దు పెట్టిన ఐటీ ఉద్యోగి
తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై లో నుంగబాక్కంలోని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయంలో రోక్స్ గాబ్రియేల్ ఫ్రాంక్టన్(36) సీనియర్ ట్యాక్స్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇదే ఆఫీసులో భర్తను కోల్పోయిన ఓ మహిళ పని మనిషిగా పని చేస్తోంది. గత ఐదేండ్ల నుంచి అక్కడ పని చేస్తున్న ఆమెపై రోక్స్ కన్నేశాడు. ఈ క్రమంలో తన గదిని పిలిపించుకున్నాడు. రూమ్ను శుభ్రం చేయాలని ఆదేశించి, గట్టిగా కౌగిలించుకున్నాడు. ముద్దు కూడా పెట్టేశాడు. …
Read More »దేశంలో కొత్తగా 201 కోవిడ్ పాజిటివ్ కేసులు
దేశంలో కొత్తగా గత 24 గంటల్లో 201 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ ఈ విషయాన్ని తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 3397 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొన్నది. వైరస్ నుంచి రికవరీ అవుతున్న రేటు 98.8 శాతంగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.గత 24 గంటల్లో 184 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. రోజువారీ పాజిటివ్ రేటు 0.15 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ చెప్పింది. …
Read More »ప్రజల ఆరోగ్యానికి తోడ్పడే వంగడాలను రూపొందించాలి : గవర్నర్ తమిళిసై
దేశ సంస్కృతిలో పండ్లు, కూరగాయలు, పూలు ఒక భాగమని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. అలాగే.. ప్రజల ఆరోగ్యాన్ని పెంపొందించే వంగాల ఉత్పత్తే లక్ష్యంగా ఉద్యాన పరిశోధనలు చేయాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రెండో స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా గవర్నర్ పాల్గొని మాట్లాడారు.విద్యార్థులు వ్యవసాయం, ప్రత్యేకించి ఉద్యాన కోర్సులు ఎంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఔషద పంటలపైనా …
Read More »రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త
ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 2023 డిసెంబర్ వరకు ఉచితరేషన్ అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో ఉచితంగా బియ్యం, గోధుమలు పంపిణీ చేయనున్నారు. మనిషికి ఐదు కిలోల వరకు అందజేయనున్నారు. దీంతో 81.35 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. 2020లో కోవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో కేంద్రం ఈ ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభించింది .ఇటీవల ఏడాది డిసెంబర్ వరకు పొడిగించగా, తాజాగా …
Read More »కరోనా కేసుల పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన
చైనాలో అనూహ్య రీతిలో పెరుగుతున్న కరోనా కేసుల పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. అవసరమైన వారికి త్వరగా ఆ దేశం వ్యాక్సిన్ ఇవ్వాలని డబ్ల్యూహెచ్వో కోరింది. చైనాలో తీవ్రమైన కరోనా కేసులు నమోదు కావడం ఆందోళనకరమే అని డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రోస్ అథనమ్ గెబ్రియాసిస్ తెలిపారు. అయితే ఏ స్థాయిలో వ్యాధి తీవ్రత ఉన్నదో ఆ దేశం వెల్లడించాలని టెడ్రోస్ కోరారు. హాస్పిటళ్లలో జరుగుతున్న అడ్మిషన్లు, …
Read More »