మోదీ సర్కార్ ఆర్టికల్ 370 ని రద్దు చేయడంతో జమ్మూ కశ్మీర్తోపాటు భారత దేశ ముఖచిత్రం కూడా మారింది. ఈ రోజు రాజ్య సభలో జమ్మూ కశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా రాజ్యసభలో ప్రకటించారు. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో జమ్ము – కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణను రద్దు చేస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. …
Read More »ఎడిటోరియల్: ఆర్టికల్ 370 రద్దు..అసలు ఆర్టికల్ 370 ఏం చెబుతోంది…!
ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న కశ్మీరీల స్వయంప్రతిపత్తికి కారణమైన ఆర్టికల్ 370 ని కేంద్రం రద్దు చేసింది. రాజ్యసభలో ఈ రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా…370 ఆర్టికల్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రాజ్యసభ దద్దరిల్లింది. గత వారం రోజులుగా కశ్మీర్లో కేంద్రం భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించింది. అమర్నాథ్ యాత్రికులతో పాటు, కశ్మీర్ నిట్ విద్యార్థులను కూడా కేంద్రం తమ స్వస్థలాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్నెట్, …
Read More »దేశంలోనే అత్యంత ధనిక పార్టీగా బీజేపీ…మళ్లీ నీతులు చెబుతారు..!
పొద్దున లేస్తే మా బీజేపీ ప్రభుత్వం.. అవినీతిమరక లేని ప్రభుత్వం..మా మోదీ సార్కు సంసార బాధలు లేవు..ఆయన ఎవరి కోసం సంపాదించే పని లేదు…దేశ ప్రజల సంపద పెంచడమే లక్ష్యంగా ఆయన పని చేస్తున్నారు అని బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకుంటూనే ఉంటారు. దేశ పౌరుల వ్యక్తిగత ఆదాయ ప్రమాణాలు ఆయన పెంచడం ఏమో కాని గత ఐదేళ్లలో బీజేపీని ధనిక పార్టీగా నిలిపారు..మోదీ సార్. ఇండియాలో 2016 నుంచి …
Read More »జాతీయ వార్తలు..
ఆఫ్రికా పర్యటన ముగించుకుని ఇండియా తిరిగి వచ్చిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రెండో రోజు బీజేపీ ఎంపీల శిక్షణా కార్యక్రమంలో పాల్గోన్న ప్రధాన మంత్రి నరేందర్ మోదీ యూపీలో ఉన్నావ్ ప్రమాద కేసులో విచారణ చేపట్టిన సీబీఐ మధ్యప్రదేశ్ లో బర్వానీ సమీపంలో బస్సు కారు ఢీకోని నలుగురు మృతి చెందారు కేరళ రోడ్డు ప్రమాదం కేసులో ఐఏఎస్ శ్రీరామ్ కు పద్నాలుగురోజుల పాటు జ్యూడిషీయల్ కస్టడీ యెడియూరప్పకు …
Read More »ఈ నెలలో బ్యాంకులకు వరుస సెలవులు…బీ అలర్ట్..!
బ్యాంకు ఖాతాదారులు జాగ్రత్తపడండి…ఈ నెల రెండవ వారంలో ఆరు రోజుల్లో బ్యాంకులు కేవలం రెండు రోజులు మాత్రమే పనిచేయనున్నాయి. ఆగస్టు 10 నుంచి 15వ తేదీలోపు నాలుగు రోజులు సెలవులు వచ్చాయి. ఆగస్టు 10న రెండవ శనివారం, ఆగస్టు 11న ఆదివారం కాగా ఆగస్టు 12న బక్రీద్ రావడంతో వరుసగా మూడు రోజులు బ్యాంకులు పనిచేయవు. ఆ తర్వాత రెండు రోజుల విరామం తర్వాత ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం …
Read More »బుుషికేష్లో టీటీడీ ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి పర్యటన..!
పవిత్ర పుణ్యక్షేత్రం బుుషికేశ్లో టీటీడీ ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి పర్యటించారు. విశాఖ శారదా పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి, ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి బాలస్వామి వారు బుుషికేష్లో చాతుర్మాస్య దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 14 వరకు స్వామిజీలు బుుషికేష్లో తపోదీక్ష అవలంబిస్తారు. తాజాగా టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు బుుషికేష్ శ్రీ విశాఖ శారదాపీఠాన్ని సందర్శించారు. ఈ రోజు బుుషికేష్కు వెళ్లిన వైవి …
Read More »మాజీ స్పీకర్ కు కీలక పదవి..?
కర్ణాటక శాసనసభ మాజీ స్పీకర్ రమేష్ కుమార్ కు ప్రతిపక్ష నాయకుడి హోదా లభించనుందా? అవుననే సమాధానాలు ఎక్కువగా వినపడుతున్నాయి. స్పీకర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన కేపీసీసీ కార్యాలయానికి వెళ్లి కాంగ్రెస్ సభ్యత్వాన్ని స్వీకరించిన సంగతి తెలిసిందే. తర్వాత పలు మార్లు బీజేపీని ఇరుకుపెట్టేలా రమేష్ కుమార్ ప్రసంగించారు. ఈ నేపథ్యంలో… ఆయన అయితేనే బీజేపీ కి మాటకి మాట ఎదురు చెప్పగలరని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్లు …
Read More »ఢిల్లీ వాసులకు శుభవార్త..ఇక నుండి కరెంట్ ఫ్రీ
ఢిల్లీ వాసులకు ఇది ఒక శుభవార్త అనే చెప్పాలి. ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కరెంట్ బిల్ ఫ్రీ అని చెప్పడంతో ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. ఎవరైనా సరే 200యూనిట్లు లోపు కరెంటు వినియోగిస్తే వారికి బిల్లు ఉండదని సీఎం ప్రకటించారు. దీనిని ఫ్రీ లైఫ్ లైన్ ఎలక్ట్రిసిటీ స్కీమ్ కింద సీఎం కేజ్రీవాల్ అమ్మల్లోకి తీసుకొస్తున్నారు. ఇది ఈ ఆగష్టు నెల నుండే వర్తిస్తుందని చెప్పడం …
Read More »సిద్దార్ధ్ తాను చనిపోతున్నట్టు భార్యకు అనుమానం రాకుండా ఎలా మ్యానేజ్ చేసాడంటే
దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిన కేఫ్ కాఫీ డే అధినేత సిద్ధార్థ ఆత్మహత్య విషయంలో ఆశ్చర్యకర విషయాలు తెలుస్తున్నాయి. తాను ఆత్మహత్య చేసుకోవడానికి ముందు మంగళూరు వెళుతున్న సమయంలో కారులో ప్రయాణిస్తున్న ఆయన ఫోన్లో అవతలి వ్యక్తులతో ఏం మాట్లాడారో ఆయన డ్రైవర్ బసవరాజ్ వెల్లడించారు. కారులో వెళుతుండగా 10 నుంచి 15 కాల్స్ చేసినట్లు డ్రైవర్ తెలిపారు. అవతలి వ్యక్తులకు సిద్ధార్థ పదేపదే క్షమాపణలు చెప్పారని వెల్లడించారు. సిద్ధార్థ భార్య …
Read More »సిద్ధార్థ స్నేహపూర్వకమైన వ్యక్తి.. కేటీఆర్
కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ మృతి చెందిన తీరు తనను షాక్కు గురిచేసిందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. కర్నాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు సిద్ధార్థ.. మంగుళూరు వద్ద ఉన్న నేత్రావతి నదిలో పడి ఆత్మాహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అతని మృతదేహాన్ని ఇవాళ ఉదయం జాలర్లు గుర్తించారు. సిద్ధార్థ చనిపోయిన తీరు తనను బాధకు గురిచేసిందని కేటీఆర్ అన్నారు. …
Read More »