రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నా వారి ఆశలు నెరవేరడం లేదు. ఏటా లక్షల సంఖ్యలో విద్యార్థులు డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ వంటి కోర్సులను పూర్తి చేస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల సంఖ్య లక్షల్లో ఉన్నా ప్రభుత్వం మాత్రం భర్తీ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఏళ్లు గడుస్తున్న కొద్దీ వయోపరిమితి మించిపోతుండడంతో యువత తీవ్ర ఆందోళనకు గురవుతోంది. మరోవైపు ఆటోమేషన్ ప్రభావంతో …
Read More »అమరావతి: కాపులకు చంద్రబాబు మరో ద్రోహం!
కాపులకు చంద్రబాబు సర్కార్ మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే కాపు రిజర్వేషన్ల విషయంలో ఆలస్యం చేస్తూ వస్తున్న చంద్రబాబు కాపులకు మరో ద్రోహానికి ఒడిగట్టారు. కాపు కార్పొరేషన్ను బీసీ సంక్షేమశాఖకు అనుసంధానం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, కాపు రిజర్వేషన్లకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై కాపు కార్పొరేషన్ ఇప్పటికే ప్రణాళికలను రచిస్తోంది. ఈ క్రమంలో కాపుకార్పొరేషన్ ఎండీని తొలగిస్తూ చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. కాపు కార్పొరేషన్ …
Read More »‘చంద్రబాబూ.. మత్తు’లో నీదొక రికార్డ్! : వైఎస్ జగన్
నేల మీద గింజల్ని పండించే రైతుల ఓట్ల కోసం.. మీ పెద్ద కొడుకులా మీ పంట రుణం తీరుస్తానంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారం చేపట్టాక రాష్ట్రం అప్పుల్లో ఉందంటూ రైతులకు మొండి చెయ్యి చూపించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు మోసాలు అనేకం. ఈ నేపథ్యంలో ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో విద్యార్థులు, ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుపుతూ సీఎం చంద్రబాబుకు …
Read More »మోసగాళ్లందు.. చంద్రబాబు మోసాలు వేరయా!
చంద్రబాబు సర్కార్కు మరో ఎదురు దెబ్బ తగిలింది. అది కూడా నెల్లూరు జిల్లాలో!. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇంటికొక జాబు ఇస్తానంటూ నిరుద్యోగులకు హామీ ఇచ్చి ఓట్లు దండుకున్న చంద్రబాబు.. ఇప్పుడు వారి ప్రాణాలపాలిట యమపాశమయ్యారు. మరోవైపు నేల మీద గింజల్ని పండించే రైతుల ఓట్ల కోసం.. మీ పెద్ద కొడుకులా మీ పంట రుణం తీరుస్తానంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు.. …
Read More »‘వియ్యంకుడైతే.. వదిలేస్తావా?- మంత్రి గంటాకు రోజా ప్రశ్న
చంద్రబాబు సర్కార్ ఏపీని అనారోగ్య రాష్ట్రంగా మార్చేసిందని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈ రోజు ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించారు. నారాయణ, చైతన్యలకు పరిమితి మించి హాస్టల్స్ను ఎలా మంజూరు చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యాశాఖ మంత్రి పదవిలో ఉన్న గంటా శ్రీనివాస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Read More »మంత్రి సుజయ్ కృష్ణకు గడ్డుకాలం!
వైకాపా అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి సారథ్యంలో.. వైఎస్ఆర్సీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన మంత్రి సుజయ్ కృష్ణకు గడ్డుకాలం మొదలైంది. మంత్రి సుజయ్ కృష్ణా రంగారావు టీడీపీలో ఇమడలేక పోతున్నారా..?, టీడీపీ నేతలతో ఆయనకు పొసగడం లేదా..? అన్న ప్రశ్నలకు వస్తున్న సమాధానాలే ఇందుకు నిదర్శనం. పై ప్రశ్నలన్నిటికీ అవుననే సమాధానం ఇస్తున్నారు విజయనగరం జిల్లా వాసులు. విజయనగరం జిల్లాలో తనకంటూ ఓ వర్గాన్ని …
Read More »మంత్రి నారాయణపై క్రిమినల్ కేసులు పెడతాం – మంత్రి గంటా
మంత్రి గంటా శ్రీనివాస్ వియ్యంకుడు మంత్రి నారాయణ స్థాపించిన నారాయణ విద్యా సంస్థలతోపాటు చైతన్య కళాశాలలపై చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్ అన్నారు. విద్యార్థులకంటే తమకు ఏదీ ముఖ్యం కాదని, అవసరమైతే కాలేజీ యాజమాన్యాలపై కేసులు పెట్టేందుకు వెనుకాడబోమని మంత్రి గంటా శ్రీనివాస్ స్పష్టం చేశారు. కాగా, ఈ రోజు మంత్రి గంటా శ్రీనివాస్ విశాఖ పరిధిలోగల నారాయణ, చైతన్య హాస్టల్స్ను తనిఖీ చేశారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో …
Read More »అవి ఆత్మహత్యలు కావు.. చంద్రబాబు హత్యలు :సీపీఐ నారాయణ
రాష్ట్రంలో ఇప్పటికే 38 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారని, అవి ఆత్మహత్యలు కావు.. ముఖ్యమంత్రి చంద్రబాబు పరోక్షంగా చేసిన హత్యలేనంటూ సీపీఐ నేత నారాయణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కాగా, ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 158 అనుమతులు లేని కాలేజీ హాస్టల్స్ ఉన్నా.. వాటిపై చంద్రబాబు సర్కార్ చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. కళాశాల యాజమాన్య వ్యక్తులే కేబినెట్లో ఉన్నారని విమర్శించారు. ప్రభుత్వం కార్పొరేట్ విద్యా సంస్థల ఉచ్చులో …
Read More »కోదండరామ్ హౌస్ అరెస్ట్.. కారణం అదే!
తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్తో సహా పలువురిని పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్టు చేశారు పోలీసులు. కాగా, ఇవాళ జనగామలో ఆరో విడత అమరవీరుల స్ఫూర్తి యాత్రను చేపట్టేందుకు టీజేఏసీ నిర్ణయించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో అల్లర్లు చెలరేగుతాయన్న నేపథ్యంలో ఈ రోజు(శనివారం) ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు వారిని హౌస్ అరెస్టు చేశారు. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమర వీరుల గొప్పతనాన్ని …
Read More »దీపావళి తర్వాత రాహుల్కు పట్టాభిషేకం?
రాహుల్ గాంధీ త్వరలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అందుకోబోతున్నారా? సోనియా గాంధీ నాయకత్వంపై పార్టీ శ్రేణులు అసంతృప్తితో ఉన్నాయా? ఈ ప్రశ్నలకు ఏఐసీసీ వర్గాలు ఔననే సమాధానమిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు.. త్వరలో రాహుల్ పట్టాభిషేకం జరగబోతోంది. పార్టీ అధ్యక్ష బాధ్యతలు రాహుల్కు అప్పగించేందుకు పార్టీలో అంతర్గత చర్చలు మొదలయ్యాయి. తొలుత దీనిపై రాహుల్ విముఖత చూపినా నాయకుల ఒత్తిడితో బాధ్యతలు స్వీకరించేందుకు అంగీకరించినట్లు తెలిసింది. అయితే, దీపావళి తర్వాత …
Read More »