Home / SLIDER (page 11)

SLIDER

త్వరలోనే పెళ్లి చేసుకుంటా

సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ త్వరలో పెళ్లి చేసుకుంటానని తెలిపారు. నానితో జంటగా తాను నటించిన ‘హాయ్ నాన్న’ చిత్రం ప్రదర్శితమవుతున్న అమెరికాలోని ఓ థియేటర్ ను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఓ అభిమాని.. ‘మీకు పెళ్లైందా?’ అని ప్రశ్నించాడు. దీనికి ఆమె త్వరలోనే చేసుకుంటానని సమాధానమిచ్చారు. కాగా మృణాల్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ‘ఫ్యామిలీ స్టార్’ మూవీలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతోంది.

Read More »

దివ్యాంగురాలు రజినీకి జీతం ఎంతో తెలుసా..?

తెలంగాణ రాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి దివ్యాంగురాలు రజినీకి ఉద్యోగం కల్పిస్తూ సంతకం చేసిన విషయం తెలిసిందే. ఆమెకు అగ్రికల్చర్ & కోఆపరేషన్ డిపార్ట్మెంటులో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగం ఇచ్చారు. హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రీయ ధ్రువీకరణ ఏజెన్సీలో ప్రాజెక్ట్ మేనేజర్గా ఆమె విధులు నిర్వర్తించనున్నారు. ఆమె నెలకు రూ.50,000లు జీతం అందుకోనున్నారు.

Read More »

ఈనెల 9 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం

తెలంగాణ వ్యాప్తంగా  ఈనెల 9 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకం అమలుతో రోజుకు సగటున రూ.4కోట్ల రాబడి తగ్గే అవకాశం ఉంటుందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీకి సగటున రోజుకు రూ.14కోట్ల రాబడి వస్తోంది.. ప్రయాణికుల్లో దాదాపు 40 శాతం మంది మహిళలు ఉంటున్నారని చెప్పారు. …

Read More »

ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే

తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్  ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని చాంద్రాయణగుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెం స్పీకర్ గా నియమించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ విషయమై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి సీఎం రేవంత్ సమాచారం అందించారట. ఒకవేళ అందుకు ఒవైసీ అంగీకరిస్తే అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్గా డిసెంబరు 9న అసెంబ్లీ కార్యకలాపాలు నిర్వహిస్తారు. దీనిపై …

Read More »

తెలంగాణ అసెంబ్లీ తొలి దళిత స్పీకర్ గా కాంగ్రెస్ ఎమ్మెల్యే

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ కు కాంగ్రెస్ అధిష్ఠానం అవకాశం ఇచ్చింది. 2008 (ఉపఎన్నిక), 2009 ఎన్నికల్లో ఆయన వికారాబాద్ నుంచి ఎమ్మెల్యే గా గెలిచారు.  దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కిరణకుమార్ రెడ్డి, రోశయ్య మంత్రివర్గంలో పనిచేశారు. 2014, 2018 ఎన్నికల్లో ఓడిన ఆయన 2022లో టీపీసీసీ కార్యనిర్వాహక కమిటీ సభ్యునిగా …

Read More »

ప్రజా భవన్ లో ప్రజా దర్భార్ -వేలాదిగా తరలివచ్చిన జనం

టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన తొలి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి కార్యాలయం జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో ప్రజా దర్భార్ మొదలైంది. ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి.. డిప్యూటీ సీఎం విక్రమార్క ఆధ్వర్యంలో  పలు శాఖల ఉన్నతాధికారుల సమక్షంలో ప్రజాదర్భార్ కొనసాగుతుంది. ఈ ప్రజా దర్భార్ కు రాష్ట్ర నలుమూలాల నుండి వేలాది ప్రజలు తరలివచ్చారు. ఈ క్రమంలో తమకు …

Read More »

ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా కోదండరామ్

ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పాటైన  కొత్త ప్రభుత్వంలో టీజేఎస్‌ అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమ నేత ప్రొఫెసర్‌ కోదండరామ్‌కు కీలక పదవి దక్కనున్నట్లు తెలిసింది. ఆయనను ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించే అవకాశాలున్నట్లు సమాచారం. కోదండరామ్‌, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ దృష్ట్యా ప్రభుత్వ పాలనలో ఆయన సహకారం తీసుకోవాలన్న ఉద్దేశంతో రేవంత్‌ రెడ్డి ఉన్నట్లు సమాచారం. నిజానికి ఎన్నికలకు …

Read More »

కేసీఆర్ త్వరగా కోలుకోవాలి – ప్రధాని మోదీ

తుంటి గాయమై సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి… బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేందర్ మోదీ ట్వీట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గాయపడటం చాలా బాధాకరం . ఆయన త్వరగా కోలుకోవాలి.. ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను ” అని ట్వీట్ పేర్కోన్నారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని రాజకీయ ప్రముఖులు, …

Read More »

ఆసుపత్రిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ – సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి… బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈరోజు ఉదయం బాత్రూంలో జారిపడి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెల్సిందే. ఈ సంఘటనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తుంటి గాయం కావడంతో వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి.. పీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో యశోద ఆసుపత్రి దగ్గర తగిన …

Read More »

నాకు తెలియకుండా ఒక్క పేపరు బయటకు పోవద్దు: సిఎస్ శాంతి కుమారి

తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్‌లో బీఆర్ఎస్ లీడర్ల కదలికలపై సీఎస్ శాంతికుమారి స్పెషల్ ఫోకస్ పెట్టారు.పేషీల నుంచి ఒక్క కాగితం కూడా బయటికి వెళ్లొద్దని ఆదేశించారు. దీంతో ప్రతి బ్యాగును సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేస్తున్నారు. అనుమానం వస్తే వెంటనే ఉన్నతా ధికారులకు ఇన్పర్మేషన్ ఇస్తున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు చకచక ఏర్పాట్లు జరుగు తుండటంతో కేసీఆర్ సర్కారులో పనిచేసిన మంత్రుల పేషీలు ఖాళీ అవుతున్నాయి. పనిలో పనిగా ఫైల్స్ తీసుకెళ్తారనే డౌట్‌తో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat