ప్రఖ్యాత జానపద వాగ్గేయకారుడు, గాయకుడు వంగపండు ప్రసాదరావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజల బాధలు- సమస్యలు, ప్రజా ఉద్యమాలే ఇతి వృత్తంగా పాటలు రాశారు.. రాసి పాడి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి జీవితాంతం పాటుపడ్డారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read More »బర్త్ డే రోజు మెగా ఫ్యాన్స్ కు శుభవార్త
ఆగస్ట్ నెల ప్రారంభమైందంటే చాలు మెగాభిమానులకు పండగే. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి బర్త్డే ఈ నెలలోనే ఉంటుంది. ఆగస్ట్ 22వ తేదీ మెగాస్టార్ చిరంజీవి బర్త్డే. అందుకే మెగాభిమానులకు ఈ నెల అంటే ఎంతో ఇష్టం. ఇక 10 రోజుల ముందు నుంచే మెగాస్టార్ బర్త్డే వేడుకలను స్టార్ట్ చేసి, రోజుకో కార్యక్రమం చొప్పున అభిమానులు సంబరాలు జరుపుతూ ఉంటారు. ఈ సంవత్సరం పరిస్థితులు అంతగా సహకరించకపోయినా.. అభిమానులు మాత్రం …
Read More »తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం…
కరోనా చికిత్స పేరుతో ప్రజల నుంచి సోమాజిగూడ డెక్కన్ ఆస్పత్రి లక్షల్లో వసూలు చేసింది. ఇప్పటికే ఈ ఆస్పత్రికి సంబంధించిన పలు సంఘటనలు వెలుగు చూశాయి. అయితే ఇలా పదే పదే కరోనా రోగులను ఇబ్బంది పెట్టడం, లక్షల రూపాయిలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఆ ఆస్పత్రి యాజమాన్యానికి కేసీఆర్ సర్కార్ ఊహించని షాకిచ్చింది. కరోనా వైద్యం అనుమతి రద్దు.. కరోనా రోగులకు చికిత్స అందించేందుకు డెక్కన్ ఆస్పత్రికి …
Read More »జిమ్లు , యోగా సెంటర్లకు మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం
అన్లాక్ 3.0 మార్గదర్శకాలను కేంద్ర హోం శాఖ జారీ చేసింది. అందులో భాగంగా ఆగస్టు 5 నుంచి జిమ్లు, యోగా కేంద్రాలు తెరుచుకోనున్నాయి. తాజాగా వీటి నిర్వహణపై అనుసరించాల్సిన విధి విధానాలకు సబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. కంటెయిన్మెంట్ ప్రాంతాల్లో ఉన్న జిమ్లు, యోగా కేంద్రాలు తెరిచేందుకు అనుమతి లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన విధి విధానాలు జిమ్లు, యోగా కేంద్రాలు …
Read More »టీఆర్ఎస్ ఎమ్మెల్సీకి కరోనా పాజిటీవ్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. సామాన్య ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఆయన కుటుంబసభ్యులు కరోనా బారిన పడ్డారు. అలాగే డ్రైవర్కు, ఇద్దరు గన్మెన్లకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం నారదాసు లక్ష్మణ్ కుటుంబం హైదరాబాద్లో చికిత్స తీసుకుంటున్నారు.
Read More »కర్ణాటక సీఎం కుమార్తెకు కరోనా
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప కుమార్తెకు కరోనా వైరస్ పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది. కరోనా సోకిన సీఎం కుమార్తెను ఆదివారం రాత్రి బెంగళూరు నగరంలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి యెడియూరప్పకు కరోనా సోకడంతో గత రెండు వారాలుగా హోంక్వారంటైన్ లో ఉన్నారు. దీంతో సీఎం అధికారిక నివాసంలోని ఉద్యోగులతోపాటు సీఎం కుమార్తెకు కరోనా పాజిటివ్ అని తేలింది.
Read More »మంత్రి హారీష్ రావుకు రాఖీ కట్టిన టీఆర్ఎస్ మహిళ నేతలు
రాఖీ పౌర్ణమి సందర్భంగా మంత్రి హరీష్రావుని కొండాపూర్లోని ఆయన నివాసంలో కలిసి టీఆర్ఎస్ మహిళా నేతలు రాఖీ కట్టారు. రాష్ట్ర ప్రజలకు హరీష్రావు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినం సోదర సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక అని హరీష్రావు పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ఆత్మీయ రక్ష బంధన్తో పాటు, స్వీయ రక్షణ పాటించాలని హరీష్రావు సూచించారు.
Read More »మంత్రి కేటీఆర్ కు రాఖీ కట్టిన టీఆర్ఎస్ మహిళ నేతలు
రక్షాబంధన్ సందర్భంగా టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్కు పార్టీ మహిళఆ నేతలు రాఖీ కట్టారు. మంత్రి సత్యవతి రాథోడ్, లోక్సభ సభ్యురాలు కవిత మాలోత్, ఎమ్మెల్యే సునీత రెడ్డి, జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి, టీఆర్ఎస్ మహిళా నాయకురాలు గుండు సుధారాణి తదితరులు మంత్రి కేటీఆర్ను ప్రగతి భవన్లో కలిసి రాఖీ కట్టారు.
Read More »ప్రధానికి ఎస్పీజీ భద్రత తగ్గింపు..కారణం ఇదేనా
ప్రధానికి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) కమాండోల భద్రత తగ్గిపోనుంది. ప్రస్తుతం ఉన్న వారిలో 50-60శాతం మంది సిబ్బందితోనే ప్రధానికి భద్రత కల్పించనున్నారు. రానున్న రోజుల్లో.. ఎస్పీజీలో ఉన్న 4వేల మంది సిబ్బందిని దశల వారీగా తగ్గించే ప్రక్రియ మొదలైందని అధికారులు తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుటుంబ సభ్యులకు కేటాయించిన కమాండోలను కూడా ఉపసంహరించాలనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉందని చెప్పారు. కేంద్ర కేబినెట్ సచివాలయ …
Read More »భారత్లో 18లక్షలు దాటిన కరోనా కేసులు
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కరోనా బాధితుల సంఖ్య 18 లక్షలు దాటింది. దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 18,03,696లకు చేరింది. గడిచిన 24 గంటల్లో 52,972 పాజిటివ్ కేసులు నమోదు అవగా…771 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 5,79,537 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 11,86,203 మంది డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటి వరకు మొత్తం 38,136 మంది …
Read More »