ఆపదలో ఉన్నామని చెప్పుకోగానే తక్షణమే స్పందించే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. జాతీయస్థాయి నీట్లో 50వ ర్యాంక్ సాధించిన కుష్వంత్ చదువుకు రూ.ఐదు లక్షలు అందజేసి అండగా నిలిచారు. ఆర్థికస్తోమత లేని బీటెక్ విద్యార్థి పవన్కు రూ.65 వేల తక్షణసాయం అందించి భరోసాగా నిలిచారు. ప్రమాదంలో ఒక కాలును కోల్పోయిన కాంబోజ సాగర్ త్రిచక్ర వాహనం ఇప్పించాలని కోరగా, టీఆర్ఎస్ సీనియర్ నేత గడ్డంపల్లి …
Read More »ఒకే దేశం- ఒకే కార్డు సక్సెస్
తెలంగాణ రాష్ట్ర స్ఫూర్తితో దేశంలో ఎక్కడైనా రేషన్ పొందేలా కేంద్రం ప్రభుత్వం అమలులోకి తీసుకురానున్న ఒకే దేశం- ఒకే కార్డు తొలి ప్రయోగం విజయవంతమయింది. వచ్చేఏడాది జూన్లోగా దేశవ్యాప్తంగా నేషనల్ పోర్టబిలిటీని అమలుచేయనున్న కేంద్రప్రభుత్వం.. ఆగస్టు 1నుంచి నాలుగు రాష్ర్టాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ను ఒక క్లస్టర్గా, గుజరాత్-మహారాష్ట్రను ఒక క్లస్టర్గా ఏర్పాటుచేసి అమలుచేయనున్నది. ఇందులోభాగంగా గురువారం హైదరాబాద్ పంజాగుట్టలోని ఒక రేషన్షాపులో దేశంలోనే …
Read More »అన్ని కుల, మతాల ప్రజలు ఆశీర్వదించి అఖండ విజయం ఇచ్చినా రాజకీయంగా ఎదుర్కోలేకే
ప్రభుత్వం మారినా.. తాను అధికారంలోకి వచ్చినా కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మతంపేరుతో కుల రాజకీయం జరుగుతూనే ఉంది. గతకొన్ని దశాబ్ధాలుగా జగన్ తండ్రి రాజశేఖరరెడ్డి, తాత రాజారెడ్డి క్రైస్తవమతం పట్ల పాటిస్తున్న విశ్వాసం గురించి బహిరంగంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అయినా దానిని ఆయుధంగా చేసుకుని అనేకమంది రాజకీయ నాయకులు జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగతమైన విశ్వాసాలను సమాజంలో చెడ్డగా చూపించడం జరుగుతోంది. అయినా జగన్ …
Read More »వైఎస్ హయంలోనే బందరు పోర్టుకు శంకుస్థాపన జరిగింది.. ఇవీ వాస్తవాలు
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలో బందరుపోర్టు శంకుస్థాపన జరిగిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ గుర్తు చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో బందర్ పోర్టు నిర్మాణం పై చర్చ జరిగింది. ఈసందర్భంగా జోగి రమేశ్ మాట్లాడుతూ.. బందరు పోర్టు నిర్మించి వేలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని వైఎస్సార్ ఆలోచన చేశారు. ఈ పోర్టుకు దశాబ్దాల చరిత్రఉంది. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చాక బందరు పోర్టుపై మాట నిలబెట్టుకోలేదు. …
Read More »కోడెల కుటుంబానికి చుక్కెదురు..ఇక జైలుకే
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలిగింది. తన కుమార్తె విజయలక్ష్మికి హైకోర్టులో చుక్కెదురు అయింది. ఆమె ముందస్తు బెయిల్ కోసం నాలుగు పిటిషన్లను దాఖలు చేయగా అన్నింటిని న్యాయస్థానం తిరస్కరించడం జరిగింది. నరసరావుపేట టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్లలో ఈ నాలుగు కేసులు నమోదు కాగా, అవన్నీ అక్రమ కేసులని, వాటిని రద్దు చెయ్యాలని కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఈ బెయిల్ ను …
Read More »త్వరలో తెలంగాణ యాంటీ బయాటిక్స్ విధానం
జలుబొచ్చినా, సాధారణ జ్వరమొచ్చినా మరో ఆలోచన లేకుండా చీటిపై యాంటీ బయాటిక్స్ను రాసే వైద్యులున్నారు. వేగంగా కోలుకోవాలని తక్కువ ఖర్చులో చికిత్స అయిపోవాలనే తాపత్రయంతో వైద్యుని సలహా లేకుండానే సొంతంగా యాంటీ బయాటిక్స్ను వినియోగించే వారూ ఉన్నారు. ఎప్పుడో చిట్టచివరి అస్త్రాలుగా వినియోగించాల్సిన ఈ ఔషధాలను.. ఇలా చిన్నాచితకా అనారోగ్య సమస్యలకు వినియోగించడం వల్ల నానాటికీ సూక్ష్మక్రిములు రోగ నిరోధక శక్తిని పెంచుకొని ఎంతకీ లొంగకుండా మొండిగా తయారవుతున్నాయి. అవసరం …
Read More »కర్నూల్ మేయర్ పీఠం – పోటీ చేయాలని యస్వీ విజయ మనోహరి పై కార్యకర్తల ఒత్తిడి !
గడిచిన ఎన్నికలలో ఘనవిజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టిన వైస్సార్సీపీ పార్టీ అదే ఊపులో స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది . గడిచిన ఎన్నికలలో 151 ఎమ్మెల్యేల సీట్లు సాధించిన అధికార పార్టీ అదే మాదిరిగా స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా క్లీన్ స్వీప్ చేయాలని పధకాలు రచిస్తోంది. ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీఇచ్చిన నవరత్నాలని ఇప్పటికే అమలు చేయటం మొదలుపెట్టిన సీఎం జగన్ మరో ముఖ్యమైన హామీని అమలుచేయటానికి …
Read More »ఈ సమావేశాలు పూర్తయ్యేవరకూ మొన్న ముగ్గురు ఔట్.. ఈరోజు ముగ్గురు ఔట్
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి మరో నలుగురు టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేశారు. సభా కార్యకలాపాలకు అడ్డుతగులుతున్నారనే కారణంతో టీడీపీ ఎమ్మెల్యేలు బెందాళం అశోక్, వాసుపల్లి గణేశ్ కుమార్, వెలగపూడి రామకృష్ణ బాబు, బాల వీరాంజనేయ స్వామిని సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. నదీజలాల పంపకంపై సభలో చర్చ జరుగుతున్న సందర్భంలో ప్రతిపక్ష సభ్యులు నిరసన చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రసంగిస్తుండగా టీడీపీ ఎమ్మెల్యేలు సభకు ఆటంకం కలిగించారు. …
Read More »కేసీఆర్ గారిని మంచివారని అంటే మీకెందుకంత కడుపు మంట అంటూ చంద్రబాబు పరువు తీసేసిన అంబటి
ఆంద్రప్రదేశ్ శాసనసభ సమావేశాలలో ఈరోజు సాగునీటి రంగం పై చర్చ జరిగింది.. ఈ సందర్భంగా గోదావరి జలాల పంపకాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ గారు చాలా మంచి వారని, ఏపీకి రావాల్సిన నదీజలాల విషయంలో హృదయపూర్వంగా సహకరిస్తున్నారని జగన్ సభలో ప్రకటించారు. దీనికి తెలుగుదేశం పార్టీ సభ్యులు, చంద్రబాబు నాయుడు అభ్యంతరం వ్యక్తం …
Read More »లండన్ లో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
ఎన్నారైల తెరాస యూకే ఆద్వర్యంలో లండన్ లో టి.ఆర్.యస్ కార్యనిర్వాహణ అధ్యక్షుడు మాజీ మంత్రి శ్రీ. కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలని లండన్ లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎన్నారై తెరాస అడ్వైసరి బోర్డు చైర్మన్ పోచారం సురేందర్ రెడ్డి హాజరయ్యారు. కార్యవర్గ సభ్యులంతా కలిసి ముందుగా కేక్ కట్ చేసి కేటీఆర్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నారై తెరాస అడ్వైసరి బోర్డు …
Read More »