ఏపీ ప్రతిపక్ష నేత ,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగింది ముమ్మాటికీ హత్యాయత్నమేనని స్పష్టమైంది. ఈ మేరకు రిమాండ్ రిపోర్టులో సంచలన వాస్తవాలు వెలుగుచూశాయి. ఈ దాడిలో వైఎస్ జగన్ మెడభాగంలో కత్తి తగిలి ఉంటే.. ఆయన అక్కడే చనిపోయి ఉండేవారని, నిందితుడు శ్రీనివాసరావు జగన్ను హత్య చేసేందుకు ప్రయత్నించాడని రిమాండ్ రిపోర్టులో స్పష్టంగా పేర్కొన్నారు. దాడి సమయంలో అదృష్టవశాత్తు వైఎస్ జగన్ కుడివైపునకు …
Read More »ఢిల్లీ సాక్షిగా పరువు తీసుకున్న బాబు
సాధారణంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ రాజధానికి వెళుతున్నారంటే అందుకు సంబంధించిన ఎజెండా ముందుగానే ప్రకటిస్తారు. ఈ విధానాన్ని అందరూ పాటిస్తారు. ఇక ప్రచారాన్ని ఓ రేంజ్లో ఇష్టపడే ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ అక్కడ ఎవరెవరిని కలుస్తారు? ఎందుకోసం ఢిల్లీ వెళుతున్నారు? వంటి వివరాలను ముందుగా వెల్లడించేవారు. విచిత్రమేమంటే ఈసారి వాటన్నింటికీ భిన్నంగా విలేకరుల సమావేశంలో మాట్లాడటానికి ఆయన ఢిల్లీ …
Read More »కాంగ్రెస్ నేతలపై నమ్మకం లేకనే ఏపీ నుంచి ఇంటెలిజెన్స్ వర్గాలను చంద్రబాబు తెలంగాణకు పంపారు….కేటీఆర్
విలేకరులమంటూ ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ పోలీసులు నిన్న ధర్మపురిలో ఎన్నికల గురించి సర్వే చేస్తుండగా వారిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై మినిస్టర్ కేటీఆర్ ఇవాళ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ నేతలను చంద్రబాబు నమ్మడం లేదు. కాంగ్రెస్ నేతలపై నమ్మకం లేకనే ఏపీ నుంచి ఇంటెలిజెన్స్ వర్గాలను చంద్రబాబు తెలంగాణకు పంపారు. విలేకరులమని చెప్పిన వారిని స్థానిక యువకులు …
Read More »తెలంగాణ రాష్ట్రంతో యూరోపియన్ దేశం ఒప్పందం..
తెలంగాణ రాష్ట్రంతో ఒప్పందం కుదర్చుకునేందుకు ఓ యూరోపియన్ దేశం ముందుకు వచ్చింది. ఆవిష్కరణలకు, సాంకేతికతకు పెద్దపీట వేస్తున్న తమ దేశం తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉందని ఎస్టోనియా రాయబారి రిహో క్రువ్ వెల్లడించారు. ఈ దిశగా ఇప్పటికే చర్చలు మొదలయ్యాయని ఆయన తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లోని తాజ్ దక్కన్ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్టోనియా దేశ స్టడీ అంబాసిడర్ పాయల్ రాజ్పాల్, వాణిజ్యం, పెట్టుబడుల సలహాదారుల …
Read More »బాబు పరువు తీసేసిన లోకేష్..!
“వైకాపా కోడి కత్తి డ్రామా! అధికారం కోసం అడ్డదారులు తొక్కడం జగన్ మోడీ రెడ్డికి కొత్త కాదు. మరోసారి ఓటమి తప్పదు అనే భయంతో కోడి కత్తి డ్రామా కి తెరలేపారు. దాడి వెనుక ఉన్న వైకాపా కుట్ర ప్రజలకు అర్థం అయ్యింది.ఇంకా ప్రజలను మభ్య పెట్టాలి అని వైకాపా నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారు.“ ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడిపై …
Read More »గాంధీభవన్లో కలకలం..!
ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో కలకలం చోటుచేసుకుంది. ఇప్పటిదాక ఒక బలమైన సామాజికవర్గానిదే హవా కొనసాగిన నేపథ్యంలో మరో వర్గం నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. తాజా పరిణామంపై భగ్గుమంటున్నారు. కాంగ్రెస్లో ఆదిపత్యం చెలాయించే వర్గం రాబోయే ఎక్కువ సీట్లలో వారే పోటీ చేస్తారని ప్రచారంలో పెట్టడంతో పాటుగా ఆమేరకు నియోజకవర్గాలనూ ఎంచుకున్నామని అంటున్నారు. దీంతో….కాంగ్రెస్లోని బీసీలంతా తిరుగుబాటు జెండా ఎగురవేశారు. వేరే కుంపటి పెట్టి అధిష్టానంపై ఒత్తిడి పెంచారు. బీసీలకు జనాభా …
Read More »పార్టీని విలీనం చేస్తా-కోదండరాం
కాంగ్రెస్ ఆధ్వర్యంలో టీడీపీ, సీపీఐ, టీజేఎస్ ఏర్పాటుచేసిన ప్రజాకూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం కొలిక్కిరావటం లేని సంగతి తెలిసిందే. చాలా స్థానాల్లో తామే బలమైన శక్తిగా చెప్పుకొంటుండటంతో పరిష్కారం జటిలమవుతోంది. ఎవరికివారు తమ వాదనలకే కట్టుబడి ఉండటంతో నిరంతర చర్చలు జరుపుతున్నా.. ఎవరెన్ని సీట్లకు? అందులోనూ ఏయేస్థానాల్లో పోటీచేయాలన్న విషయంలో స్పష్టత రావటంలేదు. టీడీపీ, సీపీఐ, టీజేఎస్ తాము ఆశిస్తున్న సీట్ల వివరాలను కాంగ్రెస్కు జాబితారూపంలో అందించాయి.ఇలా ఓ వైపు …
Read More »వలసపాలకులకు సద్దులు మోస్తున్న కాంగ్రెసోళ్లు…హరీశ్రావు
ముఖ్యమంత్రి కేసీఆర్తో నడిస్తే పొలాలకు సాగునీళ్లు అందుతాయని, చంద్రబాబుతో కలిసి నడిస్తే ప్రజలకు కన్నీళ్లే మిగులుతాయని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎప్పుడూ ఆంధ్రపాలకుల పల్లకీలు మోస్తున్నారని, నాడు వైఎస్ రాజశేఖర్రెడ్డి, నల్లారి కిరణ్కుమార్రెడ్డిలను మోసినవాళ్లు.. నేడు చంద్రబాబు పల్లకీ మోసేందుకు సిద్ధమయ్యారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం నాలుగేండ్లలో లక్షన్నర ఎకరాలకు సాగునీరందించి పాలమూరును పచ్చగా మార్చిందని చెప్పారు. తెలంగాణభవన్లో శుక్రవారం కొడంగల్ నియోజకవర్గం …
Read More »కూటమి గూబ గుయ్యిమనేలా ప్రజాతీర్పు
రాష్ట్రంలో శబ్దవిప్లవం వస్తుందని, డిసెంబర్ 11న మహకూటమి గూబ గుయ్యిమనేలా ప్రజాతీర్పు ఉంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. వందకు పైగా సీట్లతో టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. తెలంగాణ బంగారు తెలంగాణ మారే వరకు సీఎంగా కేసీఆర్ ఉంటారని చెప్పారు. జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకర్గం మేడిపల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ అభ్యర్థి చెన్నమనేని రమేశ్బాబు నేతృత్వంలో బుధవారం ఏర్పాటుచేసిన భారీ …
Read More »లీడర్ లేని కాంగ్రెస్.. క్యాడర్ కూడా లేని టీడీపీ..కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును, రాష్ట్ర అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకున్న శక్తులు మహాకూటమి పేరుతో మళ్లీ ఓట్లడిగేందుకు వస్తున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. పొరపాటునో, గ్రహపాటునో వారు అధికారంలోకి వస్తే తెలంగాణకు కడగండ్లు తప్పవని, తెలంగాణ మళ్లీ తల్లడిల్లిపోవడం ఖాయమని హెచ్చరించారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో టీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలతో నిర్వహించిన దసరా సమ్మేళనానికి మంత్రి కేటీఆర్ ముఖ్య …
Read More »