ప్రతి ఏడాదిలానే ఈ సంవత్సరం కూడా “యోగా ఫర్ హ్యూమానిటీ”అనే థీమ్తో ఇంటర్నేషనల్ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మానసిక, శారీరక వికాసానికి యోగా చాలా ముఖ్యం. దేశ వ్యాప్తంగా ప్రముఖులు, సినీతారలు ప్రత్యేక సందేశాలను అందిస్తూ యోగా ఆసనాలు వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ మైసూర్లో యోగా దినోత్సవ వేడుల్లో పాల్గొన్నారు. కాశ్మీర్తో పాటు పలు చోట్ల ఆర్మీ అధికారులు, సిబ్బంది ప్రత్యేక ఆసనాలతో అలరించారు. క్రికెటర్లు …
Read More »కత్తి తీసినా.. ఎస్సై భయపడకుండా కుమ్మేశాడు!
ఓ ఎస్సై దుండగుడితో పోరాడి అతడిని నిలువరించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన కేరళలో జరిగింది. అలప్పుజ జిల్లా కాయంకులమ్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతడి ముందు పోలీసులు జీపు ఆపే ప్రయత్నం చేశారు. ఎస్సై అరుణ్కుమార్ కిందికి దిగుతుండగా.. దుండగుడు గమనించి వెంటన తన బైక్లో ఉంచి కత్తిని బయటకు తీసి ఎస్సైపైకి దాడికి యత్నించాడు. వెంటనే …
Read More »కేసీఆర్ సీఎం అయ్యాకే రైతులకు గౌరవం: హరీష్రావు
కేసీఆర్ సీఎం అయ్యాక రైతులకు గౌరవం దక్కడంతో పాటు భూముల ధరలు పెరిగాయని తెలంగాణ మంత్రి హరీష్రావు అన్నారు. అభివృద్ధి కేవలం కేసీఆర్ వల్లే సాధ్యమైందని చెప్పారు. కాళేశ్వరం నీళ్లు హైదరాబాద్కు తెచ్చిన ఘనత కూడా ఆయనదేనన్నారు. సంగారెడ్డి జిల్లా అందోల్లో రేణుక ఎల్లమ్మ ఎత్తిపోతల పథకాన్ని హరీష్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాజెక్టుతో 14 గ్రామాలకు తాగునీరు అందుతుందని చెప్పారు. రూ.37కోట్ల …
Read More »ఘోరం.. ఒకేసారి 9 మంది సూసైడ్!
మహారాష్ట్రంలో ఘోరం జరిగింది. రెండు కుటుంబాలకు చెందిన 9 మంది మూకుమ్మడిగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. సాంగ్లి జిల్లాలోని అంబికానగర్లో ఈ దారుణం చోటు చేసుకుంది. ఆరుగురి మృతదేహాలు ఒకచోట, మరో ముగ్గురి మృతదేహాలు మరో చోట ఉన్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరంతా ఎందుకు ఒకేసారి ఆత్మహత్యకు పాల్పడ్డారనే అంశంపై లోతుగా విచారిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం గవర్నమెంట్హాస్పిటల్కి పంపించారు.
Read More »తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కు అస్వస్థత
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తేలికపాటి జ్వరంతో అస్వస్థత చెందారని ఆ రాష్ట్ర నీటివనరుల శాఖ మంత్రి దురైమురుగన్ తెలిపారు. మొన్న శనివారం రాత్రి నుంచి ఆయనకు జ్వరం రావటంతో వైద్యులు పరిశీలించి రెండు రోజుల విశ్రాంతి అవసరమని సూచించారని మంత్రి దురైమురుగన్ తెలిపారు. జ్వరం కారణంగా సోమవారం మూడు జిల్లాల్లో జరగాల్సిన ముఖ్యమంత్రి పర్యటన రద్దయ్యింది. ముందుగా ప్రకటించిన మేరకు స్టాలిన్ వేలూరు, తిరుపత్తూరు, రాణిపేట జిల్లాల్లో …
Read More »తెలంగాణలో మండలానికి రెండు మాడల్ స్కూళ్లు
తెలంగాణలో సర్కారు స్కూళ్లను సమగ్రంగా మార్చే మన ఊరు – మనబడి కార్యక్రమ పనులు ఊపందుకొన్నాయి. మొదటి విడతలో చేపట్టిన బడుల్లో పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఒక్కో మండలాన్ని ఒక యూనిట్గా చేసుకొని పనులను ఇంజినీరింగ్ ఏజెన్సీలకు అప్పగించారు. మండలానికి రెండు చొప్పున మాడల్ స్కూళ్లుగా తీర్చిదిద్దుతున్నారు. రాష్ట్రంలోని 594 మండలాల్లో 1,188 స్కూళ్లను జూన్ 30 నాటికి సిద్ధం చేయాలని గడువుగా విధించారు. మిగతా 7,935 బడుల్లోనూ పనులు …
Read More »చెర్రీ-శంకర్ కాంబినేషన్ లో మూవీ టైటిల్ ఇదేనా..?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. RRR మంచి హిట్ అందించడంతో జోష్ లో ఉన్న మెగా పవర్ స్టార్ రామ్చరణ్ ఆ చిత్రంతో పాన్ ఇండియా స్టార్గా అవతరించాడు. దీంతో చెర్రీ దానికి తగ్గట్టుగానే తాజా చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలోనే విడుదల కాబోతున్నాయి. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న అతడి తాజా చిత్రం పాన్ ఇండియా మూవీగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. పెద్ద నిర్మాత. హిట్ …
Read More »దేశంలో కరోనా కల్లోలం
దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తూనే ఉన్నది. గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. వరుసగా ఐదో రోజు 12వేలకుపైగా కొత్త కేసులు రికార్డయ్యాయి. గత 24 గంటల్లో 12,781 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా 18 మంది కరోనాతో మృత్యువాతపడగా.. 8,537 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 76వేలు దాటాయి.
Read More »అగ్నిపథ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల
కేంద్రంలో అధికారంలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన అగ్నిపథ్ స్కీమ్లో భాగంగా అగ్నివీరులను రిక్రూట్ చేసుకునేందుకు ఇండియన్ ఆర్మీ ఈ రోజు సోమవారం నోటిఫికేజన్ జారీ చేసింది. రిక్రూట్మెంట్ ర్యాలీలకు జూలై నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభంకానున్నట్లు ఇండియన్ ఆర్మీ పేర్కొన్నది. దీనికి సంబంధించిన ప్రకటన రిలీజ్ చేశారు. రక్షణశాఖలో కాంట్రాక్టు పద్ధతిలో నాలుగేళ్ల కోసం సైనికుల్ని రిక్రూట్ చేయనున్న విషయం తెలిసిందే. అగ్నిపథ్ ద్వారానానే …
Read More »