ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన డీజే టిల్లు సినిమాలో తన పాత్రతో మెప్పించిన హీరోయిన్ నేహా శెట్టిపై ఇటీవల సోషల్ మీడియాలో పలు ట్రోల్స్ వచ్చాయి. తాజాగా వాటిపై స్పందించింది ఈ బ్యూటీ.. ‘మనం ప్రతి ఒక్కరికీ నచ్చాలని లేదు. కొంతమందికి నచ్చవచ్చు. లేకపోతే లేదు. నేను చేసిన రాధికా రోల్ కొంతమందికి నచ్చలేదు. మెజార్టీ ఆడియన్స్ మాత్రం ఇష్టపడ్డారు. అది నాకు సంతోషంగా అనిపించింది’ అని చెప్పింది.
Read More »మీ ఎముకలు బలంగా ఉండాలా?
ఎముకలు బలంగా ఉండాలా? ఇవి తినండి . ఆహారంలో పైనాపిల్, స్ట్రాబెర్రీ ఉండేలా చూసుకోండి ప్రతిరోజూ యాపిల్, బొప్పాయి తినండి పాలు క్రమం తప్పకుండా తాగండి గుడ్లు నిత్యం తినండి అప్పుడప్పుడు సాల్మన్ ఫిష్, జున్ను తీసుకోండి ISF బచ్చలికూర, అవిసె, గుమ్మడి గింజలు తినండి
Read More »యూపీలో బీజేపీకి షాక్
యూపీలో చివరి దశ ఎన్నికల ముందు బీజేపీకి షాక్ తగిలింది. ప్రయాగ్జ్ బీజేపీ ఎంపీ రీటా బహుగుణ జోషి కుమారుడు మయాంక్ జోషి సమాజ్వాదీ పార్టీలో చేరారు. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్.. మయాంక్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అభివృద్ధి, మహిళల భద్రత, యువతపై అఖిలేశ్ దృష్టి పెట్టారని, రాష్ట్ర భవిష్యత్తు ఆయన చేతుల్లోనే ఉందని, అందుకే ఆయన వెంట నడవాలని నిర్ణయించుకున్నట్లు మయాంక్ తెలిపారు.
Read More »పాదయాత్రను మళ్లీ ప్రారంభించనున్న YS Sharmila
ప్రజాప్రస్థానం పేరిట YSRTP అధినేత్రి వైఎస్ షర్మిల తలపెట్టిన పాదయాత్ర ఈ నెల 11న పునఃప్రారంభం కానుంది. గత ఏడాది అక్టోబర్ 20న చేవెళ్ల నుంచి పాదయాత్రను ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రను చేపట్టాలనుకున్నారు.. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నల్లగొండ జిల్లాలోని కొండపాకగూడెం వద్ద పాదయాత్రకు బ్రేక్ పడింది. దీంతో ఇప్పుడు మళ్లీ అక్కడ నుంచే ప్రారంభించనున్నారు.
Read More »మీకు అరికాళ్లు పగులుతున్నాయా..?
అరికాళ్ల పగుళ్లకు ఇలా చెక్ పెట్టండి రాత్రి నిద్రపోయే ముందు కాలి పగుళ్లకు కొబ్బరినూనె పూయాలి. పగుళ్లు ఉన్నచోట మర్దన చేయాలి. అలోవెరా జెల్తో పాదాల పగుళ్లకు రుద్దాలి. దీనివల్ల పగుళ్లు మాయమవుతాయి. గోరువెచ్చని నీటిలో కాళ్లను పెట్టడం వల్ల చక్కని ఫలితం కలుగుతుంది. ఒక టబ్లో నీళ్లు పోసి అందులో నిమ్మరసం పిండాలి. రెండు కాళ్లను ఆ నీళ్లలో 20 నిమిషాల పాటు ముంచి బయటకు తీయాలి. దీంతో మృత …
Read More »Break Fast గా ఇవి ట్రై చేయండి
బ్రేక్ ఫాస్ట్ ఓ సారి ఇవి ట్రై చేయండి! టమాటా, కీరాలను సన్న ముక్కలుగా తురుముకుని వాటికి కాస్త ఉప్పు, మిరియాల పొడి చల్లుకుని తినొచ్చు. రుచికి రుచి, కడుపూ నిండుతుంది. పైనాపిల్ ముక్కల్లో చక్కెర వేసి గ్రిల్ చేసుకుని తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి యాపిల్ ముక్కలకు పీనట్ బటర్ పట్టించి.. వాల్ట్స్తో కలిపి తింటే రుచికరంగా ఉంటుంది.
Read More »త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న కార్తీక్ రత్నం
గతంలో విడుదలై ఘనవిజయం సాధించిన నారప్ప మూవీ నటుడు కార్తీక్ రత్నం త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తాజాగా ఆయన నిశ్చితార్థం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాలతో పాటు సన్నిహితులు, సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. కార్తీక్ రత్నం ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కేరాఫ్ కంచరపాలెం మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కార్తీక్ రత్నం నారప్ప సినిమాతో పాపులర్
Read More »దేశంలో కొత్తగా 5,476 కరోనా కేసులు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 5,476 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 158మంది కోవిడ్ వల్ల మృతిచెందారు. దేశంలో ప్రస్తుతం 59,442 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న 26,19,778 కరోనా టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Read More »ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సంచలన వ్యాఖ్యలు
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు తానే మెసేజ్ పంపించానని ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తెలిపాడు. పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుండటంతో వెంటనే ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్ కు దించాలని సూచించానన్నాడు. శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో రవీంద్ర జడేజా 175 పరుగుల వద్ద నాటౌట్ గా …
Read More »బీసీలకు తెలంగాణ సర్కారు Good News
తెలంగాణలో ఉద్యోగ నియామకాల్లో బీసీలకు వయో పరిమితిలో 10ఏళ్ల సడలింపును వర్తింపచేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. బీసీ కులాలతో పాటు వికలాంగులకు సంబంధిత రిజర్వేషన్లు, నియామకాలు, వయోపరిమితి, ఇతర ప్రయోజనాలను 2031 మే 31వ తేదీ వరకు అమలు చేసేలా ఆదేశాలిచ్చారు
Read More »