తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత,సీఎం కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శించారు. అందుకే బీజేపీ కార్యకర్తలపై దాడులు, నాయకులపై తప్పుడు కేసులు పెడుతూ కేసీఆర్ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడని వ్యాఖ్యానించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా… టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజానీకం బంగాళాఖాతంలో కలపడం ఖాయమని విజయశాంతి హెచ్చరించారు
Read More »మంచు విష్ణు సరసన పాయల్ రాజ్ పుత్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో మంచు విష్ణు హీరోగా గాలి నాగేశ్వరరావు మూవీ తెరకెక్కనుంది. ఇషాన్ సూర్య డైరెక్ట్ చేస్తున్నాడు. అవ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందిస్తున్న ఈ మూవీలో విష్ణు సరసన పాయల్ రాజ్ పుత్ నటించనుంది. స్వాతి అనే పాత్రలో తాను నటిస్తున్నట్లు ఆమె సోషల్ మీడియాలో వెల్లడించింది. ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే సమకూర్చనున్నాడు.
Read More »RRR విడుదల ఆపండి..
దర్శకవీరుడు జక్కన్న దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం RRR . ఈమూవీ విడుదల నిలిపివేయాలని కోరుతూ ప.గో. జిల్లా- ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. సినిమాలో చారిత్రక యోధులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలను రాజమౌళి వక్రీకరించారని పిటిషన్లో పేర్కొన్నారు. వారి అసలు చరిత్ర కాకుండా… …
Read More »రష్యాకు సామ్సంగ్ షాక్
ఉక్రెయిన్పై దాడి నేపథ్యంలో బహుజాతి సంస్థలు ఒక్కొక్కటిగా రష్యాలో తమ సేవలను నిలిపివేస్తున్నాయి. ఇప్పటికే యాపిల్, నైక్, ఐకియా, యూటూబ్, ఫేస్బుక్ వంటి సంస్థలు రష్యాలో తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయగా, తాజాగా సామ్సంగ్ (Samsung) కూడా ఆ జాబితాలో చేరింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశానికి ఫోన్లు, చిప్ల సరఫరాను నిలిపివేసినట్లు ప్రకటించింది సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రకటించింది. పరిస్థితులను బట్టి తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుంటామని స్పష్టం చేసింది. …
Read More »ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి అరుదైన ఆహ్వానం
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి అరుదైన ఆహ్వానం అందింది. అమెరికా సేనేట్లో ప్రసంగం చేయడానికి జెలెన్స్కీకి ఆహ్వానం వచ్చింది. జూమ్ ద్వారా జరిగే సభా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇటీవల జెలెన్స్కీతో టచ్లో ఉన్నారు. ఉక్రెయిన్పై రష్యా దాడికి దిగిన నాటి నుంచి ఆ దేశానికి బైడెన్ మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. సేనేట్లో ఉన్న సభ్యులందరితో జెలెన్స్కీ మాట్లాడనున్నారు. ఉక్రెయిన్కు చెందిన అంబాసిడర్ ఒక్సానా మర్కరోవా …
Read More »‘తెలంగాణ హెల్త్ ప్రొఫైల్’ను ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మరో పథకం ‘తెలంగాణ హెల్త్ ప్రొఫైల్’ను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం రాష్ట్రంలోని 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరి ఆరోగ్య సమగ్ర సమాచార నివేదిక (హెల్త్ ప్రొఫైల్) సిద్ధం చేయాలని నిర్ణయించింది. దీనికోసం పైలట్ ప్రాజెక్టులుగా ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇందులో భాగంగా ములుగు జిల్లా కలెక్టరేట్లో …
Read More »విరాట్ ఔట్ – వైరలవుతున్న ట్వీట్
టీమిండియా మాజీ కెప్టెన్… పరుగుల యంత్రం విరాట్ కోహ్లి శ్రీలంకతో జరుగుతున్న తొలిటెస్ట్ మ్యాచ్ తో తన వందో టెస్టులో సెంచరీ కొట్టలేడు., 45 పరుగుల వద్ద ఎంబుల్డెనియా బౌలింగ్ అవుటవుతాడని మ్యాచ్ కు ముందే ఓ ట్వీట్ వైరల్ అయ్యింది. శ్రుతి అనే పేరుతో ఉన్న యూజర్ ట్వీట్లో ఈ పోస్టు ఉంది. దీనికి వీరేంద్ర సెహ్వాగ్ వావ్ అంటూ స్పందించాడు. అయితే ఇది ఫ్యాబ్రికేటెడ్ ట్వీట్లా ఉందని …
Read More »ఆరోగ్యంగా ఉండాలంటే
ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ ఇవి పాటించండి *వ్యాయామం ప్రతిరోజూ ఓ గంటపాటు చేయాలి. *పుస్తక పఠనం, గార్డెనింగ్, కుటుంబంతో గడపడానికి * కనీసం రెండు గంటలు కేటాయించాలి. *సమయం తప్పకుండా రోజుకు మూడు సార్లు ఆహారం తినాలి. *ఐదు రకాల పండ్లు, కూరగాయలను తీసుకోవాలి. *ఏకాగ్రత కోసం ఐదారు నిమిషాలు ధ్యానం చేయాలి *రోజులో కనీసం 7 గ్లాసుల నీళ్లు తాగాలి. 8 గంటలు నిద్రపోవాలి. *రోజులో కనీసం 9వేల …
Read More »రోజూ ఒక ఉసిరి తింటే
రోజూ ఒక ఉసిరి తింటే ఉపయోగాలివే.. ఊపిరితిత్తులు, కంటి వ్యాధుల నివారణకు ఉసిరిని మంచి ఔషధం. ఉసిరిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మం త్వరగా ముడతలు పడకుండా చేస్తాయి. ఉసిరికాయల్ని గ్రైండ్ చేసి, తలకి పట్టిస్తే కళ్ల మంటలు తగ్గుతాయి. వెంట్రుకలు బాగా పెరగడంతోపాటు నల్లగా నిగనిగలాడుతూ ఉంటాయి. ఇందులో రోగ నిరోధక శక్తిని పెంచే లక్షణాలు ఉన్నాయి. ఎముకలు, దంతాలు, గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి
Read More »ఉక్రెయిన్ లో చనిపోయిన నవీన్ గురించి బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
ఉక్రెయిన్లో చనిపోయిన నవీన్ మృతదేహం తరలింపుపై కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యుద్ధ ప్రాంతం నుంచి బతికున్న వారిని తీసుకురావడం సవాల్ తో కూడుకున్న పని అని, మృతదేహాన్ని తేవడం ఇంకా కష్టమని చెప్పాడు. విమానంలో మృతదేహం ఎక్కువ స్థలం ఆక్రమిస్తుందని, ఆ ప్లేసులో 10 మంది కూర్చోవచ్చంటూ పేర్కొన్నాడు. గత 4 రోజులుగా నవీన్ డెడ్ బాడీ కోసం కుటుంబసభ్యులు ఎదురుచూస్తున్నారు.
Read More »