ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారంలో చిరంజీవి సీఎం జగన్తో భేటీ అవడంపై ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు చేశారు. అది పర్సనల్ మీటింగ్ అని, అసోసియేషన్తో సంబంధం లేదని స్పష్టం చేశారు. ఏ ఒక్కరో మాట్లాడితే సమస్య పరిష్కారం కాదని, టికెట్ల విషయంలో ఇండస్ట్రీ అంతా ఏకతాటిపైకి రావాలని చెప్పారు. రెండు ప్రభుత్వాలు ఇండస్ట్రీని ప్రోత్సహిస్తున్నాయని, సమస్య పరిష్కరిస్తామని తెలిపారు.
Read More »సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రంలోని BJP కుట్ర – మంత్రి KTR
నిన్న నల్లచట్టాలతో రైతులను నట్టేట ముంచే కుట్ర చేసిన కేంద్ర ప్రభుత్వం.. నేడు నల్లబంగారంపై కన్నేసి సింగరేణిని నిలువునా దెబ్బతీసే కుతంత్రం చేస్తోందని మంత్రి కె.తారకరామారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సింగరేణిలోని నల్లబంగారం యావత్ తెలంగాణకే కొంగుబంగారమని, సింగరేణిని దెబ్బతీస్తే కేంద్రంలోని బిజెపి కోలుకోని విధంగా దెబ్బతినడం ఖాయమని మంత్రి కేటిఆర్ హెచ్చరించారు. కేంద్రం సింగరేణిపై ప్రైవేటు వేటు వేస్తే బీజేపీపై రాజకీయంగా వేటు వేసేందుకు తెలంగాణ సమాజం సిద్ధంగా ఉందని …
Read More »ప్రధాని మోదీ హైదరాబాద్ కు రాక – చివరి నిమిషంలో సీఎం కేసీఆర్ అందుకే పోలేదు..
నేడు ప్రధాని మోదీ హైదరాబాద్కు రానున్న విషయం తెలిసిందే. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి రాష్ట్రానికి వస్తున్న మోదీకి ఇవాళ మధ్యాహ్నం 02:10 గంటలకు సీఎం కేసీఆర్ స్వాగతం పలకడమే కాకుండా… శంషాబాద్ ఎయిర్పోర్టులో అడుగు పెట్టింది మొదలు.. మళ్లీ ఢిల్లీకి పయనమై వెళ్లే వరకు ప్రధాని వెంట ముఖ్యమంత్రి ఉంటారని సీఎంవో వర్గాలు శుక్రవారం తెలిపాయి. ప్రస్తుతం కేసీఆర్ స్వల్ప జ్వరంతో బాధపడుతున్నట్టు సమాచారం. ఈ కారణంగా ప్రధానికి స్వాగతం పలికేందుకు కేసీఆర్ శంషాబాద్ …
Read More »గౌతమ్ అదానీ ఖాతాలో మరో మైలురాయి
ఇప్పటికే ఇండియాలో అత్యంత సంపన్నుడిగా నిలిచిన గౌతమ్ అదానీ మరో మైలురాయి అందుకున్నారు. 90.1 బిలియన్ డాలర్లతో అదానీ.. ముకేశ్ అంబానీని అధిగమించి ఆసియాలోనే కుబేరుడిగా నిలిచారని ఫోర్బ్స్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా పదో స్థానంలో ఉన్నారు. 2008లో ఈయన సంపద 9.3 బిలియన్ డాలర్లుగా ఉండేది. పోర్టులు, పవర్ జనరేషన్, సోలార్ పవర్, వంటనూనెలు, రియల్ ఎస్టేట్, బొగ్గు ఇలా ఎన్నో రకాల వ్యాపారాలు చేస్తోంది అదానీ గ్రూప్.
Read More »లవ్ బ్రేకప్ తర్వాత అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువ బాధపడతారు
సహాజంగా లవ్ బ్రేకప్ తర్వాత అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువ బాధపడతారని ఓ అధ్యయనంలో తేలింది. దీంతో వారికి మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని వెల్లడైంది. విడిపోయాక చాలా మంది అబ్బాయిల్లో ఆందోళన, నిరాశ ఎక్కువవుతోందని యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా శాస్త్రవేత్త ఒలిఫ్ గుర్తించారు. అది ఆత్మహత్య ఆలోచనలకు దారితీస్తోందని చెప్పారు.
Read More »మంచినీటి పైపులైన్లు, సీసి రోడ్ల ఏర్పాటుకు కృషి చేయాలని ఎమ్మెల్యే Kp కు వినతి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని ప్రాగటూల్స్ కు చెందిన సంక్షేమ సంఘం సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలో మంచినీటి పైపు లైన్లు, సీసి రోడ్ల ఏర్పాటుకు కృషి చేయాలని కోరుతూ ఎమ్మెల్యే గారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే గారు స్పందించి వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్ లో …
Read More »కళ్యాణలక్ష్మి చెక్కులు అందచేసిన ఎమ్మెల్యే చల్లా…
తెలంగాణలోని వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని సంగెం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు హన్మకొండలోని వారి నివాసంలో చెక్కులు అందచేసిన పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి గారు. ఈ సందర్భగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాకే తెలంగాణ ఆడపడుచులకు పెద్దపీట వేశారన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకానికి మహిళల పేర్లతో ప్రవేశపెట్టి తెలంగాణ ఆడపచులమీద వారికి ఉన్న ప్రత్యేకతను కేసీఆర్ గారు చాటారన్నారు. …
Read More »చంద్రబాబుకు విజయసాయి రెడ్డి సలహా
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు మాజీ సీఎం ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నానా ప్రయత్నాలు చేస్తున్నారని అధికార వైసీపీకి చెందిన సీనియర్ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. ‘ మాజీ సీఎం నారా చంద్రబాబ నాయుడు మీరు తప్పుల మీద తప్పులు చేస్తున్నావు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఈ రెండున్నరేళ్లలో డబ్బు వెదజల్లావు. ఎక్కడ …
Read More »ఆ హీరోతో గొడవపై సాయిపల్లవి క్లారిటీ
సరిగ్గా మూడేండ్ల కిందట కణం మూవీ షూటింగ్ సమయంలో సాయిపల్లవితో ఎన్నో ఇబ్బందులు పడ్డానంటూ యువహీరో నాగశౌర్య కామెంట్స్ చేశాడు. ఆ వివాదంపై సాయిపల్లవి తాజాగా స్పందించింది. ‘నాగశౌర్య అంటే ఎంతో గౌరవం ఉంది. ఆయన నాలో నచ్చని గుణం గురించి బయటకు చెప్పారు. నేను దాన్ని పాజిటివ్గా తీసుకున్నాను. నా వల్ల అతనికి ఇబ్బంది కలిగి ఉంటే అది నన్ను బాధించే విషయమే. నా సమాధానంతో ఆయన సంతృప్తి …
Read More »కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు రూ.10 లక్షలు మంజూరు చేస్తా-MLA Kp
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని ఎంఎన్ రెడ్డి నగర్ కు చెందిన సంక్షేమ సంఘం సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలో ఎమ్మెల్యే గారి సహకారంతో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరించారు. అదే విధంగా కాలనీలో నూతనంగా కమ్యూనిటీ హాల్ కోసం నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే గారికి వినతి పత్రాన్ని …
Read More »