Home / SLIDER (page 643)

SLIDER

కర్హాల్ నియోజకవర్గం నుంచి అఖిలేశ్ యాదవ్ పోటీ

నిన్న మొన్నటివరకు అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని చెబుతూ వచ్చిన సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. ఆయన కర్హాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ వెల్లడించింది. ఆయన ప్రస్తుతం అజంగఢ్ ఎంపీగా ఉన్నారు. గతంలో యూపీ సీఎంగా చేసినప్పటికీ.. మండలి నుంచి ప్రాతినిథ్యం వహించారు.

Read More »

మరోకసారి సంచలనం సృష్టించిన ఎంపీ సుబ్రమణియన్ స్వామి

ప్రస్తుత కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకు ప్రజలకు ఇన్కమ్ ట్యాక్స్ ను రద్దు చేయడం మంచిదని రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్ స్వామి అభిప్రాయపడ్డారు. రానున్న ఆర్థిక సంవత్సరం మొదటి రోజే ఈ నిర్ణయం ప్రకటిస్తే ఆర్థిక ప్రగతికి బలం ఇచ్చినట్లు అవుతుందన్నారు. ట్యాక్సేషన్ బదులుగా ప్రత్యామ్నాయ మార్గాల్లో వనరుల్ని పెంచుకోవచ్చని గతంలోనూ ప్రభుత్వానికి సూచించానని తెలిపారు.

Read More »

ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలోస్తే గెలుపు ఎవరిది..?

ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగితే ఎన్డీయే తిరిగి అధికారంలోకి వస్తుందని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో వెల్లడైంది. 543 స్థానాలున్న లోక్సభలో ఎన్డీయేకు 296, యూపీఏకు 127, ఇతరులు 120 స్థానాలు దక్కుతాయని జోస్యం చెప్పింది. ఇందులో ఒక్క బీజేపీకే 271 స్థానాలు, కాంగ్రెస్కు 62, మిగతా పార్టీలకు 210 స్థానాలు దక్కుతాయని వెల్లడించింది.

Read More »

నేడే సౌతాఫ్రికా-టీమిండియా మధ్య రెండో వన్డే

దక్షిణాఫ్రికాతో జరిగిన  టెస్టు సిరీస్ ఇప్పటికే  కోల్పోయి, తొలి వన్డేలోనూ ఓటమి పాలైన టీమిండియాకు నేడు చావోరేవో మ్యాచ్ జరగనుంది. స్టార్ స్పోర్ట్స్ 1లో మధ్యాహ్నం 2 గంటల నుంచి రెండో వన్డే ప్రత్యక్ష ప్రసారం కానుంది. వరుస విజయాలతో దక్షిణాఫ్రికా ఉత్సాహంతో ఉండగా, ఎలాగైనా రెండో వన్డేలో గెలవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్లో ఇరు మార్పుల్లేకుండానే బరిలో దిగే అవకాశం ఉంది.

Read More »

పుష్ప సినిమా తర్వాత తగ్గేదేలే అంటున్న అల్లు అర్జున్

సుకుమార్ దర్శకత్వంలో ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన పుష్ప సినిమా తర్వాత మరో పాన్ ఇండియా మూవీకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్ నిర్మించే ఈ సినిమా కోసం బన్నీ ఏకంగా రూ.75 కోట్ల రెమ్యునరేషన్ అడిగినట్లు వార్తలొస్తున్నాయి. అందుకు ఆ సంస్థ కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ డైరెక్టర్లు అట్లీ, మురుగదాస్లలో ఒకరు ఈ సినిమాకు దర్శకత్వం …

Read More »

హైదరాబాద్ లో భారీగా కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో కరోనా కేసులు భారీగానే నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,645 కరోనా కేసులు నమోదైనట్లు హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 1,670,866 కరోనా కేసులు నమోదయ్యాయి. ఓవైపు కరోనా కేసులు, మరోవైపు ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు

Read More »

కరోనా ఫస్ట్ వేవ్ థర్డ్ వేవ్ ల మధ్య తేడా ఇదే..?

ప్రస్తుత కరోనా థర్డ్ వేవ్ వ్యాక్సినేషన్ తో మరణాలు గణనీయంగా తగ్గాయని కేంద్రం వెల్లడించింది. సెకండ్ వేవ్ ఏప్రిల్ 30న 3,86,452 కొత్త కేసులు, 3,059 మరణాలు నమోదయ్యాయని తెలిపింది. అప్పటికి 2% మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తయిందని పేర్కొంది. తాజాగా జనవరి 20న 3,17,532 కేసులు, 380 మరణాలు నమోదయ్యాయని తెలిపింది. 72 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి కావడంతో మరణాల సంఖ్య భారీగా తగ్గిందని పేర్కొంది.

Read More »

తెలంగాణలో నేటి నుండి ఫీవర్‌ సర్వే

తెలంగాణ రాష్ట్రంలో  శుక్రవారం నుండి ఫీవర్‌ సర్వే నిర్వహించనున్నట్లు మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. గురువారం ఆయన జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని చెప్పారు. ఆరోగ్య సిబ్బందికితోడు మున్సిపల్, పంచాయతీ అధికారులు ఫీవర్‌ సర్వేలో పాల్గొంటారన్నారు. సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పరీక్షలు చేస్తారన్నారు.లక్షణాలున్న వారందరికీ హోం ఐసోలేషన్‌ …

Read More »

తెలంగాణలో కరోనా ఆంక్షలు పొడిగింపు

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కొవిడ్‌ ఆంక్షలను పొడిగించింది. ఇప్పటికే సభలు, సమావేశాలు, ర్యాలీలు, రాజకీయ సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలపై నిషేధం విధించింది. ఇవాళ్టితో ఆంక్షల గడువు ముగుస్తున్న తరుణంలో ఈ నెలాఖరు వరకు పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్‌ మహమ్మారి కట్టడిలో భాగంగా నిబంధనలను కఠినతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని, భౌతికదూరం పాటించాలని ప్రభుత్వం సూచించింది. …

Read More »

టాలీవుడ్ లో విషాదం

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు కొంచాడ శ్రీనివాస్ (47) అనారోగ్యంతో మరణించాడు. ఆయన స్వస్థలం శ్రీకాకుళం పలాసలో కన్నుమూశాడు. గతంలో షూటింగ్ సమయంలో పడిపోవడంతో శ్రీనుకు ఛాతీపై దెబ్బ తగిలింది.. తర్వాత గుండె సమస్యలు వచ్చినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇక శ్రీనివాస్ సుమారు 40కి పైగా సినిమాలు, 10కిపైగా టీవీ సీరియల్స్ లో నటించాడు.జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఆది,మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా MBBS, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat