టీమిండియా ప్రాక్టీస్ సెషన్లో ఆస్తకికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రత్యేక వ్యక్తి స్పెషల్ గెస్ట్గా వచ్చాడు. న్యూజిలాండ్తో ఆదివారం నుంచి వన్డే సిరీస్ ప్రారంభంకానున్న నేపథ్యంలో కోహ్లి సేన ముంబైలోని వాంఖడే స్టేడియంలో శుక్రవారం ముమ్మర సాధన చేసింది. టీమిండియా ఆటగాళ్లు అందరూ నెట్లో బాగా శ్రమించారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ ప్రాక్టీస్ సెషన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు ఇతర ఆటగాళ్లకు …
Read More »శ్రీశాంత్ సంచలన నిర్ణయం… వేరే దేశం తరఫున ఆడటానికి.. సై
బీసీసీఐ తనపై జీవితకాల నిషేధం ఎత్తివేయకపోతే వేరే దేశం తరఫున ఆడటానికైనా తాను వెనకాడనని క్రికెటర్ శ్రీశాంత్ సూచన ప్రాయంగా చెప్పాడు. తనపై బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని సమర్థిస్తూ కేరళ హైకోర్టు తీర్పు చెప్పడంతో శ్రీశాంత్ అవమాన భారంతో రగిలిపోతున్నాడు. ఇంకా తనకు క్రికెట్ ఆడే సామర్థ్యం ఉందని, బీసీసీఐ వద్దంటే వేరే దేశం తరఫున ఆడటానికి సిద్ధంగా ఉన్నానని అంటున్నాడు. దుబాయ్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న …
Read More »హార్ధిక్ను సిక్సర్లు కొట్టనీయను.. న్యూజిలాండ్ స్పిన్నర్ సవాల్..!
టీమ్ ఇండియా ఆల్ రౌండర్.. నయా హిట్టర్ హార్దిక్ పాండ్యాను సిక్సర్లు కొట్టనీయకుండా కట్టడి చేస్తానని న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ ధీమా వ్యక్తం చేశాడు. ఆదివారం వాంఖడే వేదికగా తొలి వన్డే ఆరంభంకానున్న నేపథ్యంలో మీడియాతో ఈ కివీస్ స్పిన్నర్ మాట్లాడాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన వన్డే సిరీస్లో స్పిన్నర్ ఆడమ్ జంపా బౌలింగ్లో హార్దిక్ పాండ్య హ్యాట్రిక్ సిక్సర్లు బాదేసిన విషయం తెలిసిందే. నాలుగు నెలల వ్యవధిలోనే …
Read More »యువరాజ్ సింగ్పై కేసు నమోదు.. కేసు పెట్టిన సోదరుడి భార్య
భారత క్రికెటర్ యువరాజ్ సింగ్పై గృహ హింస కింద కేసు నమోదైంది. యువరాజ్ సోదరుడు జరోవర్ సింగ్ భార్య ఆకాంక్ష శర్మ ఈ కేసు పెట్టారు. భర్త జరోవర్తో పాటు యువరాజ్ సింగ్, అత్త షబ్నం సింగ్పై గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఆకాంక్ష తరపు న్యాయవాది స్వాతి సింగ్ మాలిక్ తెలిపారు. చాన్నాళ్ల నుంచి జరోవర్ నుంచి దూరంగా ఉంటోంది ఆకాంక్ష. వీరికి ఒక …
Read More »పుట్టిన రోజు కుంబ్లే ను ఘోరంగా అవమానించిన బీసీసీఐ …
బీసీసీఐ ప్రస్తుతం క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న అతిపెద్ద ధనవంతమైన క్రికెట్ బోర్డు .అంతటి ఘనచరిత్ర ఉన్న బోర్డు కేవలం చిన్న చిన్న తప్పులను చేస్తూ అనవసరంగా వివాదాల్లో చిక్కుకుంటుంది .ఈ క్రమంలో ఈ రోజు మంగళవారం టీంఇండియా మాజీ కెప్టెన్ ,ప్రపంచ స్థాయి అగ్ర బౌలర్,టీంఇండియా మాజీ కోచ్ అయిన అనిల్కుంబ్లే పుట్టిన రోజు. ఈసందర్భంగా బీసీసీఐ ట్విటర్ ద్వారా ఆయనకు .టీమిండియా తరఫున అత్యుత్తమ బౌలర్ ఇప్పటికీ జంబోనే. …
Read More »అనుష్కను ప్రేమించడానికి అసలు కారణాన్ని చెప్పిన కోహ్లి
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ తమ రిలేషన్షిప్పై నోరు మెదపకపోయినా.. వాళ్ల సెల్ఫీలు, విహార యాత్రలు, డేటింగ్లు అందరికీ తెలిసిందే. ఈ విషయంలో ఇటు విరాట్గానీ అటు అనుష్కగానీ ఎప్పుడూ పబ్లిగ్గా మాట్లాడలేదు. అయితే ఈ మధ్య బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ఖాన్తో కలిసి కోహ్లి ఓ దివాళీ ప్రోగ్రామ్లో పాల్గొన్నపుడు …
Read More »న్యూజిలాండ్తో వన్డేల సిరీస్లో తలపడే భారత జట్టు ఇదే.. యువరాజ్ మళ్లీ
న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్లో తలపడే భారత జట్టుని సెలక్టర్లు శనివారం ప్రకటించారు. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన వన్డే సిరీస్లో విఫలమైన ఫాస్ట్ బౌలర్లు ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీలపై వేటుపడగా.. యువ బౌలర్ శార్ధూల్ ఠాకూర్కి అవకాశం కల్పించారు. గాయం నుంచి కోలుకుని శ్రీలంకతో సిరీస్లో పునరాగమనం చేసిన కేఎల్ రాహుల్ ఫామ్ అందుకోలేకపోవడంతో అతడ్ని జట్టు నుంచి తప్పించి దినేశ్ కార్తీక్కి సెలక్టర్లు మరోసారి వన్డేల్లో ఛాన్సిచ్చారు. …
Read More »హైదరాబాద్ టీ-20 క్రికెట్ మ్యాచ్కు…గొడుగులతో పోతే మీరు వెనక్కే
భారత్-ఆస్ట్రేలియా టీ-20 క్రికెట్ మ్యాచ్కు రాచకొండ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి ఏడు గంటలకు మొదలవనున్న మ్యాచ్ కోసం సుమారు 1,800 మంది పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఈసారి మ్యాచ్కు అనుమతించని నిషేధిత వస్తువుల జాబితాలో కొత్తగా గొడుగును చేర్చారు. వర్షం వచ్చే అవకాశముంది కదా అని వీక్షకులు గొడుగులు తీసుకొస్తే లోపలికి అనుమతించబోమని రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ స్పష్టం చేశారు. వీక్షకుల్ని స్టేడియం …
Read More »గెలుపెవరిదో?
– భారత్, కంగారుల మధ్య టఫ్ ఫైట్ నేడు భారత్, ఆస్ట్రేలియా మధ్య మరి కొద్ది గంటల్లో జరగనున్న మూడో టీ20 మ్యాచ్ కు హైదరాబాద్ నగర పరిధిలోగల రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికవ్వబోతున్నది. మరి కొద్ది గంటల్లో భారత్,ఆస్ట్రేలియాల మధ్య హోరాహోరీగా పోరు జరగనున్నది. రెండు టీములకూ నేడు (శుక్రవారం) జరిగే మ్యాచ్ చావో రేవో అన్నవిధంగా మారింది. అయితే ఇప్పటికే మూడు టీ20ల సిరీస్లో భారత్ …
Read More »నెహ్రా సంచలన నిర్ణయం …
టీమ్ఇండియా సీనియర్ పేసర్ ఆశిష్ నెహ్రా క్రికెట్కు వీడ్కోలు పలికేందుకు ముహూర్తం ఖరారైంది.వచ్చే నెల నవంబర్ ఒకటో తారీఖున న్యూజిలాండ్తో సొంతగడ్డ దేశ రాజధాని మహానగరం దిల్లీలో జరిగే మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నాడు! దీనికి సంబంధించి టీం ఇండియా కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లితో చర్చించిన నెహ్రా టీమ్ఇండియా సభ్యులకు తన నిర్ణయాన్ని ప్రకటించినట్లు సమాచారం. అయితే చాలా రోజుల తర్వాత జట్టులోకి …
Read More »