మత్స్య సహాకారం సంఘాల్లో నమోదైన సభ్యులందరికీ ప్రమాద బీమా పథకం వర్తింప జేయనున్నట్టు మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. ఇందుకు సంబంధించి మత్స్యకారులు చెల్లించాల్సిన ప్రీమియ మొత్తాన్ని వారి తరఫున ప్రభుత్వమే చెల్లిస్తదని స్పష్టంచేశారు. మరణించిన మత్స్యకార కుటుంబాలకు శనివారం హైదరాబాద్ హరిత ప్లాజాలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఇన్సూరెన్స్ చెక్కులను అందజేశారు. మొత్తం 105 మంది మత్స్యకార కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఇచ్చారు. ఈ సందర్భంగా …
Read More »బ్రాహ్మణుల సంక్షేమం కోసం 112 కోట్లు
బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనివిధంగా పెద్దఎత్తున సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నది. అర్చకుల దగ్గర్నుంచి విద్యార్థులు, నిరుద్యోగుల వరకు వివిధ పథకాలను అమలుచేస్తూ గత నాలుగేండ్లలో రూ.112 కోట్లకుపైగా ఖర్చుపెట్టింది. ఈ ఏడాది జనవరి నాటికి ఈ పథకాల వల్ల 3,637మందికి లబ్ధి చేకూరింది. ఈ ఏడాది బెస్ట్ స్కీమ్ కింద మరో 500మంది నిరుద్యోగులు, వివేకానంద విదేశీవిద్య పథకం కింద 100 మందికి ఆర్థిక సహాయం …
Read More »మాజీ మంత్రి ఈటలపై ఎమ్మెల్యే బాల్క సుమన్ ఫైర్
పదవులన్నీ అనుభవించి తల్లిలాంటి పార్టీని, తండ్రిలాంటి కేసీఆర్ను ఈటల రాజేందర్ మోసం చేశాడని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. గరీబోళ్ల భూములను కబ్జా చేసి, ఫిర్యాదులపై విచారణకు ఆదేశించగానే పార్టీ ఫిరాయించారని విమర్శించారు. నల్ల చట్టాలను చేసిన బీజేపీలో చేరి దొంగలతో దోస్తానా చేశాడని నిప్పులు చెరిగారు. శనివారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో సోషల్ మీడియా వారియర్స్ సమావేశానికి బాల్క సుమన్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ …
Read More »వైఎస్ షర్మిలకు మంత్రి హారీష్ కౌంటర్
తెలంగాణ ఇచ్చేందుకు అదేమైనా బీడీయా? సిగరెట్టా? అంటూ వెటకారాలు చేసిన వైఎస్ రాజశేఖర్రెడ్డి వారసులకు ఈ గడ్డపై స్థానం లేదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని సిగరెట్, బీడీలతో పోల్చిన వైఎస్ వారసులకు తెలంగాణ గడ్డ మీద జాగ ఉంటదా? అని ప్రశ్నించారు. శనివారం సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో మంత్రి హరీశ్రావు సమక్షంలో ఎంపీపీ యాదమ్మ, ఆరుగురు సర్పంచ్లతోపాటు, కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో …
Read More »తెలంగాణలోనే తొలిసారిగా మహబూబాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఫరీద్ వినూత్న కార్యక్రమం
తనదైన స్టైల్ లో వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు నిత్యం అండగా ఉండే రాష్ట్రంలోని మహబూబాబాద్ మునిపిపాలిటీ వైస్ చైర్మన్ మహ్మద్ ఫరీద్ త్వరలో ఓ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వారి సన్నిహితుల ద్వారా తెలి సింది. అక్షరాస్యులు, నిరక్షరాస్యులు అనే తేడా లేకుం డా ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ ధ్రువీకరణ పత్రాలు అవ సరం. అవి సమయానికి అందక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. కులం, ఆదాయం. నివాసం, పుట్టిన …
Read More »ఏపీతోనే కాదు.. దేవుడితోనైనా కొట్లాడి కృష్ణా నీళ్లు అందిస్తాం – మంత్రి కేటీఆర్
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రతి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు.. ఏపీతోనే కాదు.. దేవుడితోనైనా కొట్లాడి కృష్ణా నీళ్లు అందిస్తామని రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఉండగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు అన్యాయం జరగనివ్వమని తేల్చిచెప్పారు. కృష్ణా జలాలపై రాజీపడే ప్రసక్తే లేదు.. చట్టప్రకారం రావాల్సిన నీటివాటాను సాధించుకుంటాం అని పునరుద్ఘాటించారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తాము అని …
Read More »నారాయణపేటలో అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శ్రీకారం
నారాయణపేట జిల్లాలో మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు ఇవాళ శ్రీకారం చుట్టారు. పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి జిల్లా కేంద్రంలో పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ ఉదయం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో నారాయణపేట జిల్లా పర్యటనకు బయలుదేరిన కేటీఆర్.. 10 గంటలకు నారాయణపేట మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు చేరుకున్నారు. అక్కడి నుంచి జిల్లా ఆస్పత్రిలో …
Read More »చిల్డ్రన్స్, సైన్స్ పార్కును ప్రారంభించిన మంత్రి కేటీఆర్
నారాయణపేట జిల్లాలో రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. జిల్లా కేంద్రంలో పట్టణ ప్రగతి నిధులతో నిర్మించిన చిల్డ్రన్స్, సైన్స్ పార్కును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, …
Read More »నారాయణపేటలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్
నారాయణపేట జిల్లా కేంద్రంలో రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. నారాయణపేట జిల్లా ఆస్పత్రిలో చిన్నపిల్లల ఐసీయూ వార్డును కేటీఆర్ ప్రారంభించారు. సమీకృత మార్కెట్కు, అమరవీరుల స్మారక పార్కుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, కలెక్టర్ హరిచందనతో పాటు పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
Read More »పట్టణాల్లో పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి-ఎమ్మెల్యే శంకర్ నాయక్
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ పర్యటించారు. పట్టణంలోని 35వ వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్.. చెత్తను తొలగించి, మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ.. పట్టణాల్లో పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అన్ని వార్డుల్లో శానిటేషన్ పనులు చేపట్టాలని, మురుగు నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్ …
Read More »